
న్యూఢిల్లీ: భారత దేశ రాజధాని న్యూఢిల్లీలో 63వ గణతంత్ర దినోత్సవ వేడుకులు అత్యంత వైభవోపేతంగా సాగాయి. ఈ కార్యక్రమానికి భారతదేశ ప్రధమ పౌరురాలు రాష్టపతి ప్రతిభా పాటేల్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, సైనిక వందనం స్వీకరించారు. త్రివిధ దళాల కవాతు దేశ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. దేశ ఔన్నాత్యాన్ని ఈ వేడుకల ద్వారా మరో సారి చాటాయి.
భారత దేశ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా థాయిలాండ్ ప్రధాని షినవత్రా హాజరయ్యారు. ప్రధాని మన్మోహాన్సింగ్, యుపిఎ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ బిజెపి అగ్ర నేత అద్వానీ తదితరులు ఈ వేడుకల్లో పాల్గోన్నారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఆంద్రప్రదేశ్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రి దామోదర రాజనర్సింహా, స్పీకర్ నాదెండ్ల మనోహార్, పిసిసి ఛీప్ బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.
భారత దేశ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా థాయిలాండ్ ప్రధాని షినవత్రా హాజరయ్యారు. ప్రధాని మన్మోహాన్సింగ్, యుపిఎ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ బిజెపి అగ్ర నేత అద్వానీ తదితరులు ఈ వేడుకల్లో పాల్గోన్నారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఆంద్రప్రదేశ్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రి దామోదర రాజనర్సింహా, స్పీకర్ నాదెండ్ల మనోహార్, పిసిసి ఛీప్ బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.













