నిమజ్జన వేడుకల్లో హరీశ్, యువత కేరింత(పిక్చర్స్)
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జనం వేడుకల కోసం ఆయా ప్రాంతాల్లో 63 క్రేన్లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం ట్యాంక్బండ్పై గణేశ్ నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన క్రేన్లను ఆయన ప్రారంభించారు. వినాయకుడికి ప్రత్యేకంగా పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తొలసారిగా వచ్చిన వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు భక్తి, శ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. హుస్సేన్సాగర్తో పాటు నగరంలోని చెరువుల్లో నిమజ్జనం చేసే ప్రాంతాల్లో నీటి పారుదల శాఖ, జిహెచ్ఎంసిల ఆధ్వర్యంలో సుమారు 63 క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే మరో 64 మోబైల్ క్రేన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
హుస్సేన్సాగర్లో ప్రారంభమైన గణేష్ నిమజ్జనం
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు భక్తులతో పూజలందుకున్న గణనాథులను ఆదివారం ఉదయం నుంచి భక్తులు ట్యాంక్బండ్లో నిమజ్జనం చేయడం ప్రారంభించారు. చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేస్తూ తమ ఇళ్లల్లో, బస్తీ, యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను హుస్సేన్సాగ ర్లో నిమజ్జనం చేశారు.
రాత్రి 8 గంటల వరకు దాదాపు వంద విగ్రహాలు నిమజ్జనం జరిగాయి. ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసిన క్రేన్ల ద్వారా గణనాథులను నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గాంధీనగర్ పోలీసులు ట్యాంక్బండ్పై బందోబస్తు నిర్వహించారు.
నిమజ్జనం
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు భక్తులతో పూజలందుకున్న గణనాథులను ఆదివారం ఉదయం నుంచి భక్తులు ట్యాంక్బండ్లో నిమజ్జనం చేయడం ప్రారంభించారు.
నిమజ్జనం
చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేస్తూ తమ ఇళ్లల్లో, బస్తీ, యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను హుస్సేన్సాగ ర్లో నిమజ్జనం చేశారు.
నిమజ్జనం
హుస్సేన్సాగర్లో ఆదివారం రాత్రి 8 గంటల వరకు దాదాపు వంద విగ్రహాలు నిమజ్జనం జరిగాయి.
నిమజ్జనం
గణేష్ నిమజ్జన వేడుకల్లో యువత ఆనందంగా నృత్యాలు చేస్తున్న దృశ్యం.
నిమజ్జనం
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గాంధీనగర్ పోలీసులు ట్యాంక్బండ్పై బందోబస్తు నిర్వహించారు.
నిమజ్జనం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జనం వేడుకల కోసం ఆయా ప్రాంతాల్లో 63 క్రేన్లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
నిమజ్జనం
ఆదివారం ట్యాంక్బండ్పై గణేశ్ నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన క్రేన్లను ఆయన ప్రారంభించారు. వినాయకుడికి ప్రత్యేకంగా పూజలు చేశారు.
నిమజ్జనం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తొలసారిగా వచ్చిన వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు భక్తి, శ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు.
నిమజ్జనం
హుస్సేన్సాగర్తో పాటు నగరంలోని చెరువుల్లో నిమజ్జనం చేసే ప్రాంతాల్లో నీటి పారుదల శాఖ, జిహెచ్ఎంసిల ఆధ్వర్యంలో సుమారు 63 క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు.
నిమజ్జనం
అవసరమైతే మరో 64 మోబైల్ క్రేన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
నిమజ్జనం
నగరంలోని హుస్సేన్సాగర్ వద్ద వినాయక నిమజ్జన వేడుకల్లో చిన్నారుల సందడి.
నిమజ్జనం
నిమజ్జన వేడుకల్లో గణపతి బప్పా మోరియా అంటూ వినాయకుడిని తరలిస్తున్న దృశ్యం.