టి భవన్కు కెసిఆర్: డ్రైవర్తో ఆలింగనం(పిక్చర్స్)
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్కు వెళ్లారు. అక్కడ మరమ్మతులను ఆయన పరిశీలించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి తెలంగాణ భవన్కు చేరుకున్న ఆయన కార్యాలయం చుట్టూ నిర్మిస్తున్న ప్రహారీ గోడ పనులను పరిశీలించారు.
నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కార్మికులతో మాట్లాడారు. ఎన్ని రోజుల్లో పనులు పూర్తవుతాయని అడిగి తెలుసుకున్నారు. పోర్టికోలో చేపట్టాల్సిన చిన్నచిన్న మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
కార్యాలయ ఆవరణలో సుమారు 10 నిమిషాలపాటు ఉన్న సిఎం కెసిఆర్.. తెలంగాణ భవన్లోకి ప్రవేశించకుండానే వెనుదిరిగారు. ఇది ఇలా ఉండగా రంజాన్ సందర్భంగా గురువారం తన వాహన డ్రైవర్ జావెద్ను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
కెసిఆర్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్కు వెళ్లారు.
కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్కు జరుగుతున్న మరమ్మతులను ఆయన పరిశీలించారు.
కెసిఆర్
మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి తెలంగాణ భవన్కు చేరుకున్న ఆయన కార్యాలయం చుట్టూ నిర్మిస్తున్న ప్రహారీ గోడ పనులను పరిశీలించారు.
కెసిఆర్
రంజాన్ సందర్భంగా గురువారం తన వాహన డ్రైవర్ జావెద్ను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
కెసిఆర్
రంజాన్ సందర్భంగా గురువారం తన వాహన డ్రైవర్ జావెద్కు శుభకాంక్షలు చెబుతున్న సిఎం కెసిఆర్.