ఫ్యాషన్ యాత్ర: అందాల ఆరబోత (పిక్చర్స్)
హైదరాబాద్: మారుతున్న ట్రెండ్స్కు అనుగుణంగా సరికొత్త ఫ్యాషన్లను ముందుకు తీసుకు వస్తూ జరిగే ఫ్యాషన్ యాత్ర హైదరాబాద్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. శుక్రవారం ఒక్క రోజే తాజ్ కృష్ణాలో జరిగిన ఈ యాత్రకు వివిధ ప్రాంతాలకు చెందిన 45 మందికి పైగా డిజైనర్లు వచ్చారు.
అప్పెరల్, కిడ్స్వేర్, ఫుట్వేర్, ఫర్నిచర్, జ్యుయెల్లరీ, యాక్ససరీలవంటి ఫ్యాషన్గా కనిపించే వస్తువులను అన్నింటీ పోత పోశారు. ఈ ప్రదర్శన ద్వారా వచ్చిన సొమ్మును బాలికల విద్యకు వినియోగిస్తామని నిర్వాహకులు చెప్పారు.
రంజాన్ సీజన్లో డ్రై ఫ్రూట్స్కు, అందులోనూ ఖర్జూరకు గిరాకీ ఉంటుంది. దాన్ని తీసుకోవడం పరిపాటి. ఈ ఖర్జూరాను గిఫ్ట్ ఐటెంగా మార్చారు ఆంబ్రోసియా డిలక్టస్పెన్ సంస్థ.
ఫ్యాషన్ యాత్ర...
హైదరాబాదులోని తాజ్ కృష్ణాలో జరిగిన ఫ్యాషన్ యాత్రలో సరికొత్త శైలితో కూడిన నగలను ధరించి ఓ మగువ ఇలా..
ఫ్యాషన్ యాత్ర
ఫ్యాషన్ యాత్రలో వివిధ వస్తువులను ప్రదర్శనకు పెట్టారు. వాటిలో పాదరక్షలు కూడా ఉన్నాయి. వాటిని పరిశీలిస్తూ మహిళలు ఇలా..
ఫ్యాషన్ యాత్ర
హైదరాబాద్ తాజ్ కృష్ణాలో జరిగిన ఫ్యాషన్ యాత్రలో అందమైన దుస్తులను, చీరెలను ప్రదర్శించారు. వాటిని పరిశీలిస్తున్న దృశ్యం
ఫ్యాషన్ యాత్ర
డిజైనర్లు రూపొందించి సరికొత్త దుస్తులను, నగలను ధరించి భామలు అందాలు ఆరబోస్తే తప్పకుండా ఆకర్షణ ఉంటుంది.
ఫ్యాషన్ యాత్ర
హైదరాబాద్ తాజ్ కృష్ణాలో జరిగిన ఫ్యాషన్ యాత్రలో గాజులను కూడా ప్రదర్శించారు. వాటిని మహిళలు పరిశీలిస్తూ ఇలా..
ఫ్యాషన్ యాత్ర
హైదరాబాద్ తాజ్ కృష్ణాలో శుక్రవారం జరిగిన ఫ్యాషన్ యాత్రలో యువతులు, యువకులు, మహిళలు ఇలా సందడిగా కనిపించారు.
ఫ్యాషన్ యాత్ర
హైదరాబాద్ తాజ్ కృష్ణాలో జరిగిన ఫ్యాషన్ యాత్రలో ప్రదర్శించిన వస్తువుల్లో ఏది చూసినా అటే మనసు లాగుతున్నట్లుగా సందడి..