డ్రైవర్ని హెచ్చరించిన శోభ, ఆళ్లగడ్డ జనసంద్రం (పిక్చర్స్)
రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు శోభా నాగిరెడ్డి... కారును వేగంగా నడపవద్దని ముందే తన డ్రైవర్ను హెచ్చరించారట. ఆళ్లగడ్డ సమీపంలో బుధవారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది.
రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో నంద్యాల నుండి బయలుదేరిన సమయంలో శోభా నాగిరెడ్డి తన భర్త భూమా నాగిరెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. కారు మితిమీరిన వేగంతో వెళ్తుండటాన్ని గుర్తించిన శోభా నాగిరెడ్డి.. వేగంగా నడపవద్దని డ్రైవర్తో పదేపదే చెప్పారట.
రోడ్డుపై వరి కుప్పలు ఉండటంతో డ్రైవర్ నాగేంద్ర కారును పక్కకు తప్పించే ప్రయత్నం చేశాడని, ఈ క్రమంలో వాహనాన్ని నియంత్రించలేక పోవడంతో ప్రమాదం జరిగింది. దీంతో కారు నాలుగు పల్టీలు కొట్టి వంద గజాల దూరంలో పడింది. సీటు బెల్టు పెట్టుకోనందున శోభా నాగిరెడ్డి కారు ముందు అధ్దంలోంచి దూరంగా పడిపోయారు.
శోభా నాగిరెడ్డి
తన భర్త భూమా నాగిరెడ్డి, ఇద్దరు కూతుళ్లు, కుమారుడితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు శోభా నాగిరెడ్డి ఉన్న దృశ్యం.
లక్ష్మీ పార్వతి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతదేహాన్ని సందర్శించిన లక్ష్మీ పార్వతి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు.
అభిమానులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతదేహం వద్ద అభిమానులు, కుటుంబ సభ్యులు కన్నీరు కారుస్తూ...
భర్త
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతదేహం వద్ద అభిమానులు, కుటుంబ సభ్యులు కన్నీరు కారుస్తూ...
జనమే జనం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతదేహం చూసేందుకు ఆళ్లగడ్డకు భారీ ఎత్తున తరలి వచ్చిన అభిమానులు.
కుటుంబ సభ్యులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతదేహం వద్ద అభిమానులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు.
శోభా నాగిరెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు శోభా నాగిరెడ్డి తన భర్త, మాజీ పార్లమెంటు సభ్యులు భూమా నాగిరెడ్డితో కలిసి చిరునవ్వులు చిందిస్తూ...