బాబుని నిలదీసి, ఏడ్చిన ఎమ్మెల్యే భార్య (పిక్చర్స్)
తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. సీమాంధ్రలో నామినేషన్ల దాఖలు ఘట్టం ముగింపు రోజు శనివారం కూడా టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు స్వపక్షం నుంచి పెద్దఎత్తున నిరసనలు ఎదుర్కొన్నారు.
కడప జిల్లా పొద్దుటూరు శాసనసభ సీటుకు సిట్టింగ్ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డిని పక్కన పెట్టి ఈ దఫా కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన సీనియర్ నేత వరదరాజులు రెడ్డికి టిక్కెట్ ఖాయపర్చారు.
దీంతో లింగారెడ్డి తన సతీమణితో సహా శనివారం ఉదయం నేరుగా ఇక్కడి ఓ స్టార్ హోటల్లో బస చేసి ఉన్న చంద్రబాబు వద్దకు వచ్చారు. ఆయనను కలిసి తీవ్రస్థాయిలో తన అసంతృప్తి, నిరసనను వ్యక్తం చేశారు. లింగారెడ్డి భార్య భోరున విలపించారు.
చంద్రబాబు
దీర్ఘకాలంగా పార్టీకి సేవలందించినందుకు తమకిచ్చే గౌరవం ఇదేనా అంటూ లింగారెడ్డి సతీమణి చంద్రబాబును నిలదీసినంత పని చేశారు.
చంద్రబాబు
ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది లింగారెడ్డి దంపతులను వెలుపలకు తీసుకెళ్లారు. హోటల్ ఎదుట లింగారెడ్డి అనుచరులు కొందరు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కొందరిని అరెస్టు చేశారు.
చంద్రబాబు
ప్రొద్దుటూరు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే లింగా రెడ్డి శనివారం రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనను పార్టీ బుజ్జగించే పనిలో పడింది.
చంద్రబాబు
మరోవైపు విజయవాడ తూర్పు సీటును గద్దె రామ్మోహన రావుకు ఇవ్వడాన్ని మరో నేత తప్పు పట్టారు. ఆయన వర్గం కూడా హోటల్ ఎదుట ధర్నా నిర్వహించింది.