వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు పార్టీకి గొడుగు గుర్తు?

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
ప్రజారాజ్యం పార్టీని ఉమ్మడి ఎన్నికల గుర్తు వివాదం చేదు గుర్తులా వెంటాడుతోంది. అయితే కథ సుఖాంతమయ్యేలా కన్పిస్తోంది. ఉమ్మడి గుర్తు పొందడానికి అనేక ప్రయత్నాలు చేసిన ప్రజారాజ్యం చివరికి సిక్కిం పార్టీని ఆశ్రయించినట్టు తెలుస్తోంది. సిక్కింలో అధికారంలో ఉన్న సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎస్ డిఎఫ్) తో ప్రజారాజ్యం ఒక అవగాహనకు వచ్చినట్టు చెబుతున్నారు. సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ తో ఈ విషయంలో కొన్ని షరతులతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఒప్పందం మీద సంతకాలు జరిగితే ఎస్ డి ఎఫ్ గొడుగు గుర్తుపై ప్రజారాజ్యం అభ్యర్ధులంతా పోటీ చేయవచ్చు.

ఈ ముసాయిదా ఒప్పందం ప్రకారం చామ్లింగ్ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి తన అభ్యర్ధులకు "బి" ఫామ్స్ ఇచ్చే అధికారాన్ని కట్టబెడతారు. చిరంజీవి అభ్యర్ధులందరూ సాంకేతికంగా ఎస్ డి ఎఫ్ అభర్ధుల కిందే లెక్క. ఎస్ డి ఎఫ్ సిక్కింలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాబట్టి ఆ పార్టీ మరో రాష్ట్రంలో పోటీ చేయదలచుకుంటే ఆ గొడుగు గుర్తును ఆ రాష్ట్రం ఎవరికీ కేటాయించరు.

సిక్కిం మాజీ గవర్నర్, న్యాయకోవిదుడు పి.శివశంకర్ ఈ విషయంలో చిరంజీవికి సహాయం చేసినట్టు తెలుస్తోంది. శివశంకర్ ప్రస్తుతం ప్రజారాజ్యం పార్టీలో పెద్ద మనిషిగా ఉన్నారు. ఈ ఒప్పందం కుదరడం వల్లనే ఉమ్మడి గుర్తు పిటిషన్ ను నిన్న హైకోర్టు నుంచి ప్రజారాజ్యం పార్టీ ఉపసంహరించుకున్నట్టు తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X