వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిరు పార్టీకి గొడుగు గుర్తు?
ఈ ముసాయిదా ఒప్పందం ప్రకారం చామ్లింగ్ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి తన అభ్యర్ధులకు "బి" ఫామ్స్ ఇచ్చే అధికారాన్ని కట్టబెడతారు. చిరంజీవి అభ్యర్ధులందరూ సాంకేతికంగా ఎస్ డి ఎఫ్ అభర్ధుల కిందే లెక్క. ఎస్ డి ఎఫ్ సిక్కింలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాబట్టి ఆ పార్టీ మరో రాష్ట్రంలో పోటీ చేయదలచుకుంటే ఆ గొడుగు గుర్తును ఆ రాష్ట్రం ఎవరికీ కేటాయించరు.
సిక్కిం మాజీ గవర్నర్, న్యాయకోవిదుడు పి.శివశంకర్ ఈ విషయంలో చిరంజీవికి సహాయం చేసినట్టు తెలుస్తోంది. శివశంకర్ ప్రస్తుతం ప్రజారాజ్యం పార్టీలో పెద్ద మనిషిగా ఉన్నారు. ఈ ఒప్పందం కుదరడం వల్లనే ఉమ్మడి గుర్తు పిటిషన్ ను నిన్న హైకోర్టు నుంచి ప్రజారాజ్యం పార్టీ ఉపసంహరించుకున్నట్టు తెలిసింది.
Story first published: Wednesday, March 18, 2009, 12:03 [IST]