వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు చాణక్యం, ఆమోదించి తిరగ్గొట్టారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
సమాచార కమిషనర్ల నియామకం విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారనే మాట వినిపిస్తోంది. సమాచార కమిషనర్ల నియామకం కోసం జరిగిన సమావేశంలో ఆయన విచిత్రంగా ప్రభుత్వానికి ఓటేశారు. పైగా, ఎనిమిది మంది సమాచార కమిషనర్లలో ఆయన సూచించిన ఇద్దరున్నారు. అయితే, ఆ తర్వాత ఆయన యూ టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ప్రభుత్వ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సమాచార కమిషనర్లలో చాలా మంది ఏదో రాజకీయ పార్టీకి చెందినవారే ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ స్థితిలో చంద్రబాబు సమాచార కమిషనర్ల నియామకంపై ఆమోదం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు.

చంద్రబాబు సమాచార కమిషనర్ల నియామకానికి ముందు అంగీకరించి, ఆ తర్వాత తిరగ్గొట్టడం వెనక రాజకీయ చాణక్యం ఉందని అంటున్నారు. కానీ, చంద్రబాబు అడుగు వెనకేయడం రాజకీయ చాణక్యమేమీ కాదని, అందులో మరో మతలబు ఉందని అంటున్నారు. ఆ మతలబు ఏమిటా అని ఆరా తీస్తే - సమాచార కమిషనర్ల నియామకానికి వ్యతిరేకంగా మర్నాడే రామోజీరావుకు చెందిన ఈనాడు దినపత్రికలో ఓ వార్తాకథనం వచ్చింది. అన్నీ రాజకీయ నియామకాలేనని విమర్శిస్తూ ఆ వార్తాకథనం ప్రచురితమైంది. దీనివల్లనే చంద్రబాబు వెనక్కి తగ్గి ఏమీ చెప్పకుండా దాటేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary
Reports of the Telugu Desam chief, Mr N. Chandrababu Naidu, recording his dissent at the appointment of information commissioners came as a surprise to the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X