జగన్తో చిన్నాన్న: హీరో మహేష్ ఫ్యామిలీలో చిచ్చు
అకస్మాత్తుగా ఆదిశేషగిరి రావు తీసుకున్న నిర్ణయం మహేష్ బాబు కుటుంబానికి సమస్యగా మారింది. తానే కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్ధులకు అవసరమైతే తన సోదరుడు కృష్ణ కూడా ప్రచారం చేస్తాడని శేషగిరి రావు ఆదివారం కాకినాడలో చేసిన ప్రకటనతో గల్లా కుటుంబం దిమ్మ తిరిగిందని అంటున్నారు. గుంటూరు జిల్లా కు స్ధానికేతరుడైనప్పటికీ గల్లా జయదేవ్ తన మామగారైన ఘట్టమ నేని కృష్ణ కుటుంబాన్నే నమ్ముకుని పోటీకి దిగారు.
ప్రత్యక్ష రాజకీయా లకు దశాబ్దాల క్రితమే దూరమైన కృష్ణ కుటుంబం తాజాగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అనుకుంది. కొంత కాలం ఆయన సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు మాత్రం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం పార్టీలోని తెర వెనుక రాజకీయాలు నడిపారు. వైయస్ మరణం తర్వాత ఆయన కూడా రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. అయితే, రాష్ట్ర విభజన నేపధ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి ఆదిశేషగిరి రావు రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. అందుకు వేదికగా తెలు గుదేశం పార్టీని ఎంచుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో మంత్రి గా పనిచేసిన గల్లా అరుణకుమారి, ఆమె కుమారుడు గల్లా జయదేవ్తో పాటు ఆదిశేషగిరి రావు కూడా టిడిపిలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నుండి అల్లుడు జయదేవ్, తెనాలి నుండి చిన్నమామగారు ఆది శేషగిరి రావు ఎన్నికల బరిలో నిలవాలనుకున్నారు. అయితే, జయదేవ్కు గుంటూరు లోక్సభ టిక్కెట్టు ఇచ్చిన టిడిపి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో గల్లా అరుణకుమారికి టిక్కెట్టు ఇచ్చింది. అంతేకాకుండా తెనాలిలో ఆదిశేషగిరి రావుకు టిక్కెట్టు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దాంతో ఆదిశేషగిరి రావు జగన్ పార్టీ వైపు మళ్లారు.
అకస్మాత్తుగా ఆదిశేషగిరి రావు ఒక ప్రకటన చేశారు. కృష్ణ అభిమానులందరూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దాంతో అభిమానుల్లో ఒక్కసారిగా అయోమయం మొదలైంది. పైగా కృష్ణ, మహేష్ బాబు అభిమానులతో ఆదిశేషగిరి రావు టచ్లో ఉన్నారు. మొత్తం మీద, ఆదిశేషగిరి రావు కారణంగా మహేష్ బాబు కుటుంబంలో అలజడి ప్రారంభమైంది.