వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైక్‌ను ఢీకొట్టిన షర్మిల ప్రచార వాహనం

By Pratap
|
Google Oneindia TeluguNews

కాకినాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల ప్రచార వాహనం ఓ బైక్‌ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఆ కారులో షర్మిల లేరు. షర్మిల ఆదివారంనాడు తూర్పు గోదావరి జిల్లాలోని కరపలో ప్రచారం సాగించారు. బహిరంగ సభలో కూడా ప్రసంగించారు.

అక్కడ ప్రచారం చేసిన తర్వాత షర్మిల ఆ ప్రచార వాహనం దిగి మరో వాహనంలో ఎక్కాడు. విశాఖపట్నం బయలుదేరారు. షర్మిల ప్రచార వాహనంలో గన్‌మ న్, డ్రైవర్ కాకినాడకు వస్తుండగా ఆ వాహనం ఓ బైక్‌ను ఢీకొట్టింది.

 Sharmila’s campaign car hurts 2 in road accident

ఆ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆస్పత్రికి వచ్చారు. గాయపడినవారిలో ఒకరిని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఇందుకు సంబంధించి కేసు నమోదైంది.

ఎన్నికల్లో పోటీ చేయకుండా వైయస్ షర్మిల సీమాంధ్రలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె సీమాంధ్రలోని పలు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

English summary

 Two youth were injured when the campaign vehicle of YSR Congress leader Y.S. Sharmila hit the bike, they were riding. However, she was not in the car when the accident took place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X