వేతనం తీసుకోని శాస్త్రి, మౌంట్ బాటెన్ మాత్రం..
న్యూఢిల్లీ: భారత దేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ పదవీ విరమణ అనంతరం పింఛన్ తీసుకోవడానికి నిరాకరించారని నాటి ఓ ఫైల్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆయన దానిని నిరాకరించినందున దానిని ప్రభుత్వ విపత్తు నిధిలో జమ చేశారని ఆ ఫైలులో ఉంది.
మరోవైపు అత్యంత నిరాడంబరుడిగా, నిజాయితీపరుడిగా పేరు పొందిన మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కనీసం తన వేతనం కూడా తీసుకునే వారు కాదని మరో ఫైల్ ద్వారా వెల్లడయింది. ఈ సొమ్మును కూడా ప్రభుత్వ విపత్తు నిధికే పంపించేవారట.
మన దేశ జాతీయ నాయకులు ప్రజల కోసం, దేశం కోసం తమ సొమ్ము ఖర్చు పెట్టేందుకు ముందుకు వచ్చారు. అయితే భారత దేశ తొలి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ (బ్రిటన్ నేత) మాత్రం ఆనాడే.. కేవలం టీఏ, డీఏల కింద రూ.64 వేలు తీసుకున్నారట.
నరేంద్ర మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు పాతదస్త్రాల బూజు దులిపిన కేంద్ర హోంశాఖ అధికారులు పలు చారిత్రక అంశాలను వెలికి తీశారు. నాటి నాయకుల గొప్పతనాన్ని ఈ దస్త్రాలు తెలియజేస్తున్నాయి.
రాజేంద్ర ప్రసాద్
భారత దేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ పదవీ విరమణ అనంతరం పింఛన్ తీసుకోవడానికి నిరాకరించారని నాటి ఓ ఫైల్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆయన దానిని నిరాకరించినందున దానిని ప్రభుత్వ విపత్తు నిధిలో జమ చేశారని ఆ ఫైలులో ఉంది.
లాల్ బహదూర్ శాస్త్రి
అత్యంత నిరాడంబరుడిగా, నిజాయితీపరుడిగా పేరు పొందిన మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కనీసం తన వేతనం కూడా తీసుకునే వారు కాదని మరో ఫైల్ ద్వారా వెల్లడయింది. ఈ సొమ్మును కూడా ప్రభుత్వ విపత్తు నిధికే పంపించేవారట.
లార్డ్ మౌంట్ బాటెన్
మన దేశ జాతీయ నాయకులు ప్రజల కోసం, దేశం కోసం తమ సొమ్ము ఖర్చు పెట్టేందుకు ముందుకు వచ్చారు. అయితే భారత దేశ తొలి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ (బ్రిటన్ నేత) మాత్రం ఆనాడే.. కేవలం టీఏ, డీఏల కింద రూ.64 వేలు తీసుకున్నారట.