Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
‘దేవుడు చేసిన మనుషులు’ ఫస్ట్ డే కలెక్షన్స్
హైదరాబాద్: రవితేజ-ఇలియానా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం తొలి రోజు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. ఇప్పటికే బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయిన 'జులాయి' చిత్రం, మరో వైపు సల్మాన్ ఖాన్ ఏక్ థా టైగర్ చిత్రాల పోటీని తట్టుకుని తొలి రోజు రూ. 5.5 కోట్ల వసూళ్లు సాధించింది.
ఈ రేంజిలో కలెక్షన్లు రావడానికి కావడం రవితేజ-పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషనే. అయితే సినిమా తొలి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈచిత్రం వసూళ్లు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం లేక పోలేదు. అయితే రవితేజ-పూరి మూవీ కాబట్టి ఆశాజనకమైన పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది.
దేవుడు చేసిన మనుషులు చిత్రం తొలి రోజు మొత్తం 600 స్క్రీన్లలో విడుదలైంది. ఇందులో 563 స్కీన్లు ఇండియాలో, 29 స్క్రీన్లు అమెరికాలో, 8 స్ర్కీన్లు యూకెలో కేటాయించబడ్డాయి. గతంలో విడుదలైన రవితేజ 'దరువు' చిత్రం తొలిరోజు రూ. 4.5 కోట్లు వసూలు చేసింది. దాంతో పోల్చుకుంటే దేవుడు చేసిన మనుషులు చిత్రానికి తొలిరోజు మరో కోటి అదనంగా వసూలవ్వడం గమనార్హం.