Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షాక్ అవుతున్నారు :రామ్ చరణా...మజాకానా
హైదరాబాద్ : సినిమా హిట్, ఫ్లాపులతో సంభంధం లేకుండా కలెక్షన్స్ ఉండే హీరోలు ఎవరూ అంటే మెగా హీరోలు అనే చెప్పాలి. గతంలో చిరంజీవి , తర్వాత కాలంలో పవన్ కళ్యాణ్ చిత్రాలు కలెక్షన్స్ ఇప్పుడు ఆ లీగ్ లోకి రామ్ చరణ్ వచ్చారు. దాంతో రిలీజ్ కు ముందు జరిగే బిజినెస్ పై ఆ ఇంపాక్ట్ పడింది. రామ్ చరణ్ తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం సీడెడ్ రైట్స్ స్టన్నింగ్ ప్రైస్ కి వెళ్లిందని సమాచారం. సీడెడ్ కి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి... 8.1 కోట్లుకు తీసుకున్నట్లు చెప్తున్నారు.
చేతిలో వేణువు లేదు.. కానీ చీరలెత్తుకెళ్లేంత చిలిపితనం ఉంది. నెత్తిన పింఛం పెట్టుకోడు. కానీ ఎదుటివాళ్లకు టోపీ పెట్టే చాకచక్యం ఉంది. రధసారథ్యం చేయడు.. కానీ ఓ యుద్ధాన్ని ఆపేసే తెలివితేటలున్నాయి. అతను బృందావనంలో గోవిందుడు కాదు గానీ.. అతని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నందనవనం చేయాలనుకొనే ఉంటాడు. ఇంతకీ అతనెవరో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు కృష్ణవంశీ. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'.
రామ్చరణ్ హీరోయిన్ . కాజల్ హీరోయిన్. శ్రీకాంత్, ప్రకాష్రాజ్, జయసుధ, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన ఓ సెట్లో ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే 'గోవిందుడు..' టీజర్ విడుదల చేయబోతున్నారు.
ఇటీవలే టీజర్ని కాజల్ వీక్షించిందట. ''టీజర్ భలే ఉంది. తెరంతా ఓ పండగ వాతావరణం కనిపిస్తోంది'' అని చెప్పుకొచ్చింది. వచ్చే వారంలో చిత్ర బృందం పొల్లాచ్చి వెళ్లనుంది. అక్కడి నుంచి తిరిగొచ్చాక లండన్ పయనం అవుతుంది. అక్కడ పాటల్ని తెరకెక్కిస్తారు. అక్టోబరు 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. యువన్ శంకర్ రాజా స్వరాలు అందిస్తున్నారు.
శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.