Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
డేటిచ్చేసారు..హిట్ ఖాయం అని టాక్
హైదరాబాద్ : నిఖిల్, స్వాతి జంటగా నటిస్తున్న చిత్రం 'కార్తికేయ'. ఈ చిత్రంలోని పాటలు రీసెంట్ గా ఆదిత్యా మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలయ్యాయి. మాగ్నస్ సినీప్రైమ్ ప్రై. లిమిటెడ్ పతాకంపై వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఆగస్టు 1 న విడుదల చేయటానికి నిర్ణయించారు. ఈ కాంబినేషన్ లో ఈ చిత్రం హిట్ కొడితే ఇక నిఖిల్ డేట్స్ కష్టం అని అంటున్నారు. ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని ఇండస్ట్రీలో మంచి టాక్ ఉంది.
తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాననీ, తాను కలిసి పనిచేసిన హీరోయిన్లలో స్వాతి ది బెస్ట్ అనీ హీరో నిఖిల్ తెలిపారు. ఇది తనకు కొత్త తరహా చిత్రమనీ, ఇందులో ప్రతి అంశం తనకు కొత్త అనుభవాన్ని కలిగించిందనీ, పాటలు, సినిమా ప్రేక్షకులకు నచ్చుతాయనీ సంగీత దర్శకుడు శేఖర్చంద్ర చెప్పారు.
నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ "రెగ్యులర్ సినిమాల్లా రొటీన్గా కాకుండా డెప్త్ ఉన్న సబ్జెక్టుతో ఈ సినిమా రూపొందింది. మంచి సినిమా రావాలంటే మంచి టీమ్ కుదరాలి. ఈ సినిమాకి అలాంటి టీమ్ కుదిరింది. దర్శకుడు చాలా క్లారిటీతో ఈ సినిమా తీశాడు. కచ్చితంగా ఇది ప్రేక్షకాదరణ పొందే చిత్రం. '' అని చెప్పారు. అందరూ ట్రైలర్ బాగుందని చెబుతున్నారనీ, సినిమా కూడా బాగుందని చెబితే ఇంకా ఆనందిస్తాననీ దర్శకుడు చందు అన్నారు.
దేవాలయం నేపధ్యంలో వరుస మరణాల మిస్టరీ ని చేదించడానికి నిఖిల్ ఒక గ్రామానికి వెళ్తాడు. ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో విడుదలకానుంది. నిఖిల్ సిద్ధార్ధ, స్వాతీ తమ గత చిత్రం 'స్వామి రారా' విజయంతో చాలా ఆనందంగా వున్నారు. మరోసారి ఆ మ్యాజిక్ ను తెరపై ప్రదర్శించాలని కోరుకుంటున్నారు.
ఈ చిత్రం గురించి నిఖిల్ మాట్లాడుతూ.... ఇది ఎంటర్ టైన్మెంట్ బేస్ గా ఉంటుంది, ముఖ్యంగా సామర్లకోట దగ్గరలోని బెమ్మేశ్వరాలయం చుట్టూ జరిగే కథ ఇది. అన్ని కమర్షియల్ అంశాలు ఉన్న ఈ చిత్రం నాకు స్వామి రా రా తరువాత మంచి హిట్ ఇస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ...పూర్తి వినోదాత్మకంగా సినిమా సాగుతుంది. వైజాగ్, అరకు, సామర్ల కోటలోని భీమేశ్వరాలయంలో షూటింగ్ చేసాం. గుడి నేపథ్యంలో సాగే కథ ఇది. అయితే హిస్టారికల్, పీరియాడికల్ మాత్రం కాదు అని తెలిపారు.
ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో తనికెళ్ల భరణి, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, తులసి, కిషోర్, జోగి నాయుడు, తాగుబోతు రమేష్, పృథ్వి, గౌతం రాజు, శివన్నారాయణ, స్వామి రారా సత్య, గిరి తదితరులు నటిస్తున్నారు. కెమెరా : కార్తిక్, సంగీతం : శేఖర్ చంద్ర, ఎడిటింగ్ : కార్తిక శ్రీనివాస్, ఆర్ట్ : సాహి సురేష్, పాటలు : కృష్ణ చైతన్య, కొరియోగ్రఫీ : రఘు, ఫైట్స్ : వెంకట్ నాగు, సమర్పణ : శిరువూరి రాజేష్ వర్మ, నిర్మాత : వెంకట శ్రీనివాస్ బొగ్గరం, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : చందు మొండేటి.