Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నిఖిల్ ‘కార్తికేయ’ శాటిలైట్ రైట్స్ ఎవరికి...ఎంతకి
హైదరాబాద్ : నిఖిల్, స్వాతి హీరోహీరోయిన్లుగా మాగ్నస్ సినిప్రైమ్ ప్రై.లిమిటెడ్ సమర్పణలో వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాతగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ' కార్తికేయ'. ఈ చిత్రం శాటైలైట్ రైట్స్ జెమెనీ ఛానెల్ వారు కోటి ముఫ్పై లక్షలకు తీసుకున్నారని సమాచారం. గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన 'స్వామి రా రా'తో విజయాల బాట పట్టాడు నిఖిల్. ఇటీవల వైవిధ్యమైన కథల్ని ఎంచుకొంటూ ప్రయాణం చేస్తున్నాడు. దాంతో ఈ చిత్రంపైనా మంచి అంచనాలే ఉన్నాయి.
ఒక ప్రశ్నకు సమాధానం దొరకలేదు అంటే ఆ లోపం ప్రశ్నది కాదు..పయత్నానిదే అని బలం గా విశ్వసించే ఓ యువకుడి జీవితంలో ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. హీరోహీరోయిన్లు ఇద్దరూ వైద్య విద్యార్థులుగా కనిపిస్తారు. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. నిఖిల్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందిస్తున్న చిత్రమిది. దేవాలయం నేపధ్యంలో వరుస మరణాల మిస్టరీ ని చేదించడానికి నిఖిల్ ఒక గ్రామానికి వెళ్తాడు..అక్కడ జరిగే సంఘటనలతో ఈ చిత్రం ఉత్కంఠతో రూపొందింది.
ఈ చిత్రం గురించి నిఖిల్ మాట్లాడుతూ.... ఇది ఎంటర్ టైన్మెంట్ బేస్ గా ఉంటుంది, ముఖ్యంగా సామర్లకోట దగ్గరలోని బెమ్మేశ్వరాలయం చుట్టూ జరిగే కథ ఇది. అన్ని కమర్షియల్ అంశాలు ఉన్న ఈ చిత్రం నాకు స్వామి రా రా తరువాత మంచి హిట్ ఇస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ...పూర్తి వినోదాత్మకంగా సినిమా సాగుతుంది. వైజాగ్, అరకు, సామర్ల కోటలోని భీమేశ్వరాలయంలో షూటింగ్ చేసాం. గుడి నేపథ్యంలో సాగే కథ ఇది. అయితే హిస్టారికల్, పీరియాడికల్ మాత్రం కాదు అని తెలిపారు.
ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో తనికెళ్ల భరణి, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, తులసి, కిషోర్, జోగి నాయుడు, తాగుబోతు రమేష్, పృథ్వి, గౌతం రాజు, శివన్నారాయణ, స్వామి రారా సత్య, గిరి తదితరులు నటిస్తున్నారు. కెమెరా : కార్తిక్, సంగీతం : శేఖర్ చంద్ర, ఎడిటింగ్ : కార్తిక శ్రీనివాస్, ఆర్ట్ : సాహి సురేష్, పాటలు : కృష్ణ చైతన్య, కొరియోగ్రఫీ : రఘు, ఫైట్స్ : వెంకట్ నాగు, సమర్పణ : శిరువూరి రాజేష్ వర్మ, నిర్మాత : వెంకట శ్రీనివాస్ బొగ్గరం, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : చందు మొండేటి.