Don't Miss!
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఒక్క టీజర్...31 కోట్లు బిజినెస్ తెచ్చింది
హైదరాబాద్ : రవితేజ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం 'పవర్'. హన్సిక హీరోయిన్ . కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబి) దర్శకుడుగా పరిచయమవుతున్నారు. రాక్లైన్ వెంకటేష్ నిర్మాత. తమన్ అందించిన ఈ చిత్రం ఆడియోని రీసెంట్ గా విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రం నిమిత్తం విడుదల చేసిన రెండు టీజర్స్ డిస్టిబ్యూటర్స్ ని బాగా ఎట్రాక్ట్ చేయంటంతో ఎంక్వైరీలు ఊపందుకున్నాయని అంటున్నారు. పక్కా మాస్ మసాలా చిత్రంగా ఈ చిత్రం రూపొందిందని టాక్ తేవటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ట్రేడ్ లో వినపడుతున్న లెక్కలు ప్రకారం... ఈ చిత్రం వరల్డ్ వైడ్ థియోటకల్ బిజినెస్ ఇప్పటికి 23.5 జరిగిందని సమాచారం. నైజాం ఏరియా 7.5, ఎపి రైట్స్ 12 కోట్లకు అమ్మారని సమాచారం. కర్ణాటక బిజినెస్ రెండు కోట్లు ఉండగా...ఓవర్ సీస్, మిగిలిన ఇండియా రైట్స్ కలిపి రెండు కోట్లు జరిగిందిని తెలుస్తోంది.
ఇక మరో ప్రక్క ఆడియో,శాటిలైట్ రైట్స్ కలిపి 7.5 వచ్చాయని వినికిడి. దాంతో మొత్తం ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 31 కోట్లు జరిగిందని అంటున్నారు. ఇది రవితేజ చిత్రాలలో పెద్ద రికార్డు.
దర్శకుడు మాట్లాడుతూ... పవర్ అంటే ఇంటికొచ్చే కరెంటు కాదు. బయట చేసే రాజకీయం కాదు. అది ఒంట్లో ఉండాలి.. అలాంటి హీరోని మా చిత్రంలో చూడొచ్చు అన్నారు అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''పవర్ ఫుల్ పోలీస్ కథ ఇది. పేరుకు తగ్గట్టుగానే ప్రతీ సన్నివేశం శక్తిమంతంగా ఉంటుంది. రవితేజ సినిమా నుంచి ఎలాంటి అంశాలు ఆశిస్తారో.. అవన్నీ మేళవించి ఓ రంగుల హరివిల్లులా తీర్చిదిద్దాం ''అన్నారు.
ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, రావూ రమేష్, సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతమ్రాజు, మాటలు:కోన వెంకట్, నిర్మాత:రాక్లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి).