Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘ఎవడు' టోటల్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)
హైదరాబాద్: సంక్రాంతి కానుకగా విడుదలైన 'ఎవడు' మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. పండగ సీజన్ లో సినిమాకు హిట్ టాక్ రావటం కలెక్షన్స్ పరంగా ప్లస్ అయ్యింది. ఈ చిత్రం బిజినెస్ 47 కోట్ల దగ్గర ఆగిందని ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు. ఈ చిత్రం పోటీ అయిన 1 నేనొక్కడినే కమర్షియల్ గా డ్రాప్ అవటం కూడా సినిమాకు కలిసివచ్చింది. అయితే ఇప్పటికే సేఫ్ జోన్ లో ఉండటంతో నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. ఈ చిత్రం టోటల్ కలెక్షన్స్ ని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన లెక్కలు ఇలా ఉన్నాయి.
టోటల్ కలెక్షన్స్ (ఏరియావైజ్)
నైజాం: రూ. 12.26 కోట్లు
సీడెడ్: రూ. 7.95 కోట్లు
నెల్లూరు: రూ. 2.05 కోట్లు
కృష్ణా: రూ. 2.36 కోట్లు
గుంటూరు: రూ. 3.58 కోట్లు
వైజాగ్: రూ. 4.70 కోట్లు
ఈస్ట్ గోదావరి: రూ. 3.35 కోట్లు
వెస్ట్ గోదావరి: రూ. 2.70 కోట్లు
టోటల్ ఏపీ షేర్ : రూ. 39.34 కోట్లు
కర్నాటక : రూ.5.06 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : రూ. 1.00 కోట్లు
టోటల్ ఆంధ్రా : రూ. 38.57 కోట్లు
ఓవర్ సీస్: రూ. 1.70 కోట్లు
మొత్తం వరల్డ్ వైడ్: రూ. 47.1 కోట్లు
చిత్ర దర్శకులు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ 3 సంవత్సరాలపాటు నిద్రకు దూరమయ్యానని, ఇంత కష్టానికి ప్రేక్షకులు అందించిన తీయని విజయం సంతోషాన్నిస్తోందన్నారు. తెలుగు ప్రజలున్నంత కాలం తెలుగు చిత్రసీమ పదిలంగా ఉంటుందని, ప్రేక్షకుల ఆదరణ మరువరానిదని కృతజ్ఞతలు తెలిపారు. కథాపరంగా రామ్చరణ్తోపాటు మరో ప్రముఖ హీరో అల్లు అర్జున్ కేవలం కథను నమ్మి ఈ సినిమాలో నటించటం ఎప్పటికీ మరచిపోలేనన్నారు.
దిల్రాజు మాట్లాడుతూ సంవత్సరంన్నర పాటు శ్రమించి ఎవడు చిత్రీకరించామని 6 నెలల పాటు కొన్ని కారణాల వలన విడుదల చేయలేకపోయామన్నారు. చిత్రం విడుదల ఆలస్యం కావటంతో అనేక వదంతులు వచ్చాయని, వేటినీ తాము లెక్కచేయలేదని, కథాబలం ఉండటం వలనే ప్రేక్షకులు చిత్రానికి విజయం అందిచారన్నారు.