twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన స్టార్ హీరోలు - నైజాం రికార్డ్ లు(ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : మన తెలుగు సినిమా మార్కెట్ లో నైజాం ఏరియాకు ప్రత్యేక స్దానం ఉంది. అక్కడ బిజినెస్ ని బట్టే సినిమాని ట్రేడ్ లో అంచనా వేస్తారు. అలాగే అక్కడ కలెక్షన్సే సినిమాకు సిసలైన కలెక్షన్స్ గా అభిమానులు చెప్పుకుంటారు. అంత ప్రబావితం చేసే నైజాం ఏరియాపై కొద్ది మంది హీరోలకే ప్రత్యేకమైన గ్రిప్ ఉంది. వారి సినిమాలకూ అక్కడ వీర డిమాండ్ ఉంది.

    అలాగే నైజాం కలెక్షన్స్ ని బట్టే మన హీరోల స్టేటస్ ఏంటి, ఎంతవరకూ అతనిపై పెట్టుబడి పెట్టచ్చు,రెమ్యునేషన్ వంటి వివరాలు ఆధార పడి ఉంటాయి. మన టాప్ హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ లు నైజాం ఏరియాలో మైల్ స్టోన్స్ ని ఎప్పుడో దాటేసారు.

    ఇక మొదట నుంచి మెగా క్యాంప్ హీరోలకు ముఖ్యంగా చిరంజీవికి నైజాం ఏరియా పెట్టని కోటలా ఉంటూ వచ్చింది. ఇప్పటికి అక్కడ ఆయన మార్కెట్ కు ఢోకాలేదని చెప్తారు. ఆయన 150 సినిమా వస్తే ఓ రేంజిలో బిజినెస్ అయ్యే అవకాసం ఉందని అంటూంటారు. మిగతా హీరోలు పరిస్ధితి ఏమిటి... నైజాం లో రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఏమిటి అనేది పరిశీలిస్తే...

    గమనిక: ఈ క్రింద చెప్పబడుతున్న కలెక్షన్స్ ,రికార్డులు ట్రేడ్ లో చెప్పబడుతున్నవే కానీ...అథికారికంగా ఎక్కడా ప్రకటించినవి కాదని గమనించగలరు.

    సినిమాలు-రికార్డులు

    స్టేట్ రౌడీ

    స్టేట్ రౌడీ

    చిరంజీవి హీరోగా వచ్చిన ఈ చిత్రం 23,మార్చి 1989న విడుదలై వెంటనే హిట్ టాక్ తెచ్చుకుంది. భాక్సాఫీస్ వద్ద ఇది కొత్త రికార్డులు క్రియేట్ చేసిన చిత్రంగా చెప్తారు. ముఖ్యంగా నైజాం ఏరియాలో కోటి రూపాయలు షేర్ తీసుకువచ్చి తెలుగు సినిమా స్టామినా ఏమిటో తెలిపి ల్యాండ్ మార్క్ గా నిలిచింది.

    పోకిరి

    పోకిరి

    మహేష్,పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి చిత్రం 2006లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం తొలిసారిగా 10 కోట్లు షేర్ ని నైజాం ఏరియాలో దాటింది. అక్కడ ఫుల్ రన్ షేర్ 11.70 వచ్చింది. ఆ తర్వాత ఈ రికార్డుని బ్రద్దలు కొట్టటానికి ఏ చిత్రమూ సాహసించలేకపోయింది.

    మగధీర

    మగధీర

    రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం 20 కోట్ల మైలు రాయిని నైజం ఏరియాలో షేర్ గా దాటి కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. 2009 లో వచ్చిన ఈ చిత్రం పాత రికార్డులను చెరిపేసి కొత్తవి క్రియేట్ చేసింది. నైజాం ఏరియాలో 24.80 కోట్లు షేర్ సాధించింది.

    అత్తారింటికి దారేది

    అత్తారింటికి దారేది

    పవన్ కళ్యాణ్ తాజా చిత్రం అత్తారింటికి దారేది సృష్టిస్తున్న రికార్డులు ఏ రేంజో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం 25 కోట్లు నైజాంలో సాధించి మరో కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఇంక వంద రోజులు నాటికి ఇంకా ఎన్ని రికార్డులు సాధిస్తుందో చూడాల్సి ఉంది.

    English summary
    Nizam area is a place where every hero wants to prove his mettle at the box office. The reason is quite clear. The collections of Nizam area are said to be one of the parameters to decide the status of a hero in tollywood. Incidentally, tollywood top heroes such as Chiranjeevi, Pawan Kalyan, Ram Charan and Mahesh Babu crossed the interesting milestones in Nizam area and the details are as follows.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X