Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కళ్యాణ్ నెక్ట్స్ చిత్రం ఆ డైరక్టర్ తో..!?
పవన్ కళ్యాణ్ చేస్తున్న 'కొమురం పులి' చిత్రం రిలీజుకు ముస్తాబవుతున్న సందర్భంలో ఆయన తర్వాత ఏ చిత్రం చేయబోతారనే ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. అందుకు తగ్గట్లే హరీష్ శంకర్, పూరీ జగన్నాధ్, విజయ్ భాస్కర్ వంటి పేర్లు వినిపించాయి. కానీ హఠాత్తుగా చిరంజీవితో 'బావగారు బావున్నారా', 'శంకర్ దాదా ఎంబిబియస్' చిత్రాలు రూపొందించిన దర్శకుడు జయంత్ సి. పరాన్జీ సీన్ లోకి వచ్చారు. ఆయన ఇప్పటికే పవన్ కి ఓ కథ వినిపించారని, అది ఓకే అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
రవితేజ, నయనతారల కాంబినేషన్ లో ఆంజనేయులు చిత్రాన్ని నిర్మించిన హాస్య నటుడు గణేష్ ఈ చిత్రం చేయనున్నారని చెప్తున్నారు. ఇక జయంత్ ప్రస్తుతం అంతా కొత్త వారితో లవ్ ఫర్ ఎవర్ అనే చిత్రం రూపొందిస్తున్నారు. అలాగే పవన్ తో చేయబోయే చిత్రం ఫన్ తో కలిసిన లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోందని చెప్తున్నారు. ఇక జయింత్ సైతం తన రీఎంట్రీకి పవన్ వంటి స్టార్ అయితేనే సరిపోతాడని భావిస్తున్నారు. అంటే త్వరలో ఓ 'ప్రేమించుకుందాం రా','ప్రేమంటే ఇదేరా' వంటి ప్రేమ కథతో వస్తారేమో చూద్దాం.