Don't Miss!
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- News సంచలన నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'దాసరి సినిమాకు పట్టిన దరిద్రం' అని తిట్టడానికి అస్సలు కారణం?
సినీ నిర్మాత యలమంచిలి రవిచంద్ సినీ నిర్మాత దాసరి నారాయణరావును ఉద్దేశించి చేసిన కామెంట్ అంతటా పెద్ద చర్చగా మారింది. దాసరి నారాయణరావు సినిమాకు పట్టిన దరిద్రం అని ఆయన డైరక్ట్ గానే అన్నారు. అయితే దీనికి కారణం ఏమిటీ అని విచారిస్తే.. సినిమా కార్మికుల సమ్మె వెనుక దాసరి నారాయణరావు ఉన్నారని అనుమానం తోటే ఇలా అన్నారని తెలుస్తోంది. పైకి సినిమా పరిశ్రమకు ప్రయోజనం చేకూరేలా పనిచేస్తానని చెబుతూ దాసరి నారాయణరావు లోపల మాత్రం అన్ని సినీ వ్యతిరేక చర్యలు చేస్తున్నారన్నది ఆయన ఇలా కామెంట్ చేసారని సిని జనం అంటున్నారు. సిని కార్మికుల వేతనాలు పెంచుతామని ఒప్పుకున్నప్పటికీ వారు రకరకాల షరతులు పెడుతూ అనేక సమస్యలు సృష్టించారని ఇదంతా దాసరి వెనక నుంచి ఆడించిన డ్రామా అని కొందరు విమర్శిస్తున్నారు. అయితే ఈ వివాదంపై దాసరి నారాయణరావు చాలా జాగ్రత్తగా స్పందించారు. సినీ పరిశ్రమలో అబిప్రాయ బేధాలు ఉండవచ్చని, అంత మాత్రాన ఐక్యంగా లేనట్లుగాదని అన్నారు.