Don't Miss!
- News జపాన్ను వణికించిన భూకంపం
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
పూరి - గణేష్ ల కాంబినేషన్ లో ఆ మెగా హీరో ‘పవన్’ నేనా
నాలుగయిదు రోజలు క్రితమే రవితేజతో, 'ఇడియట్"కు సీక్వెల్ తీస్తానంటూ పూరి ప్రకటన జారీ చేసాడు. ఆ సినిమాను తానే నిర్మించబోతున్నానని సైతం పూరి ఆ ప్రకటనలో తెలిపాడు. సరిగ్గా నాలుగు రోజుల అనంతరం దర్శకత్వంలో గణేష్ బాబు సినిమా అనే ప్రకటన విడుదలైంది. నాలుగయిదు రోజుల క్రితం పూరి అనౌన్స్ చేసిన 'ఇడియట్ 2" చిత్రాన్నే గణేష్ బాబు నిర్మించే అవకాశం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
నిజానికి పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ సినిమాతోనే గణేష్ బాబు నిర్మాత కావాల్సి ఉంది. పవన్ కి, పూరికి మూడేళ్ల క్రితమే భారీ అడ్వాన్సులిచ్చేసి ఉన్నాడు గణేష్ బాబు. అయితే కారణాంతరాల వలన ఆ కాంబినేషన్ కార్య రూపం దాల్చలేదు. కాకపోతే పవన్ మాత్ర గణేష్ బాబుకు'తీన్ మార్" చేసి పెట్టాడు. ఆ సినిమా ద్వారా వచ్చిన నష్టాన్ని పూడ్చేందుకు తాజాగా 'గబ్బర్ సింగ్" కూడా చేస్తున్నాడు. కానీ పూరికి ఇచ్చిన అడ్వాన్స్ మాత్రం అలాగే ఉండిపోయింది. మరి 2012 ప్రారంభమయ్యే ఆ కొత్త చిత్రంలో ఓ స్టార్ హీరో అన్న గణేష్ బాబు మళ్ళీ పవన్ కళ్యాణ్ కే ఆ అవకాశం ఇస్తాడా...అలాకాకపోతే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందే 'ఇడియట్ పార్ట్2" నిర్మించే అవకాశం గణేష్ బాబుకే దక్కుతుందా..అనే విషయం చిత్రం ప్రారంభం వరకూ వేచి చూడాల్సిందే.