Don't Miss!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- News ఏపీలో ఇప్పటివరకు భారీగా పట్టుబడిన నగదు, మద్యం, బంగారం.. అత్యధికంగా ఎక్కడంటే
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బన్నీని బోల్తా కొట్టించిన వినాయక్ చరణ్ ని ‘మెరి’పిస్తాడా...!?
ఆరెంజ్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ దర్శకడు ధరణితో 'మెరుపు" అనే సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. కాజల్ హీరోయిన్ గా కమిట్ అయిన ఈ చిత్రం దాదాపు మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఆరెంజ్ ఊహించని రీతిలో ప్లాప్ కావడం, ఈ సినిమాకి భారీ రేంజ్ లో బడ్జెట్ ఎస్టిమేట్ కావడంతో చరణ్ రిస్క్ ఎందుకని ఈ సినిమాని పక్కన పెట్టి సంపత్ నందితో 'రచ్చ" సినిమాకి కమిట్ అయ్యాడు.
దీంతో ఈ సినిమా నుండి దర్శకుడు ధరణి, హీరోయిన్ కాజల్ ఇద్దరూ తప్పుకున్నారు. ఇటీవల ఓ సందర్భంలో రామ్ చరణ్ 'మెరుపు" ఆగిపోలేదని ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించడంతో దాదాపు అటకెక్కేసిందనుకున్న ఈ సినిమాపై మళ్ళీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర కథకి మరికొన్ని మాస్ హంగులు అద్ది కమర్షియల్ దర్శకుడు వివి వినాయక్ దర్శక్వంలో వహించబోతున్నాడని తెలుస్తుంది. వచ్చే నెలలోనే సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనేందుకు రామ్ చరణ్ తన డేట్స్ ను ఎడ్జస్ట్ చేసుకుంటున్నాడట. మరి అల్లు అర్జున్ ని బోల్తా కొట్టించిన వినాయక్ కనీసం చరణ్ నైనా మెరిపిస్తాడేమో చూడాలి..