Don't Miss!
- News చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోమారు కుమ్మక్కు: ఓటుకు నోటు కేసుపై ఎమ్మెల్యే ఆర్కే సంచలనం
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘ఖైదీ’ గా మహేష్, చరణ్ కంటే మిస్టర్ ఫర్ ఫెక్ట్ అయితే..!?
చిరంజీవి చిత్రం 'ఖైదీ"ని మహేష్ బాబుతో రీమేక్ చేయాలనే ఐడియాతో పూరీ జగన్నాథ్ ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఇదిలా ుంటే ఖైదీ" రీమేక్ లో నటిస్తే బాగుంటుందని, ఆ మాస్ గెటప్ చరణ్ కే సూట్ అవుతుందని, మహేష్ బాబుకు అంత మాస్ గెటప్ అస్సలు సూట్ అవ్వదని కొంతమంది వాదిస్తున్నారు.
అయితే వీరు మెగా ఫ్యాన్సూకాదు...ఘట్టమనేని ఫ్యాన్సూ కాదు...సినీ ప్రియులు కావడం విశేషం. ఈ ఇద్దరూ కాకుండా ప్రభాస్ ఈ రీమేక్ లో చేస్తే ఇంకా బాగుంటుందని కూడా వీరు చెబుతున్నారు. అందుకు నిదర్శనం చత్రపతి అంటున్నారు. ప్రభాస్ కి మాస్ ఫాలోయింగ్ చాలానే ఉందంటున్నారు. వీరి వాదనకు చాలా మంది ఓట్లు పడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ వాదనలను పూరీ జగన్నాథ్ పరిగణలోకి తీసుకుంటే 'ఖైదీ" రీమేక్ ని మహేష్ బాబుతో చేసే సాహసం చేస్తాడా?లేదా అనే విషయం తెలియాల్సివుంది.
కాగా ప్రస్తుతం ప్రభాస్ లారెన్స్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ మీడియా పతాకం పై ప్రముఖ నిర్మాతలు జె భగవాన్, జె పుల్లారావు, నిర్మిస్తున్న భారీ చిత్రం 'రెబల్" చివరి షెడ్యూల్ నవంబర్ 5 నుంచి ఏకదాటిగా జరగుతుంది. ఇప్పటివరకు 50 రోజులపాటు జరిగిన షూటింగ్ లో కొన్నిముఖ్య సన్నివేశాలు, రెండు మేజర్ యాక్షన్ సీక్వెన్స్ లు, ఒక పాటు చిత్రీకరించడం జరిగింది. ఇందులో తమన్నా, దీక్షా సేథ్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు..