Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలకృష్ణ చిత్రానికి షాకిచ్చే రేంజి బడ్జెట్?
బాలకృష్ణ చిత్రానకి యాభై కోట్ల బడ్జెట్ అనేది ఇప్పుడు అంతటా వినిపిస్తున్న హాట్ టాపిక్. అంత బడ్జెట్ పెట్టి చేసే చిత్రము ఏమిటీ అంటే బాలకృష్ణ హీరోగా ఆనాటి సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ 'ఆదిత్య 369'సీక్వెల్. ఈ రేంజి బడ్జెట్ తో బాలకృష్ణ సినిమా చేయటం అనేది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అయితే గ్రాఫిక్స్ కు, సెట్స్ కు ఆ రేంజి తప్పదని అంటున్నారు. గత కాలానికి వెళ్లటం, అలాగే భవిష్యత్ ని చూపటం వంటివి ఈ సారి కూడా చేయనున్నారు. టైమ్ మెషిన్ నేపద్యంలో రూపొందే ఈ చిత్రం తప్పకుండా పిల్లలని,పెద్దలను టార్గెట్ చేస్తూ అలరిస్తుందని భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాని సింగీతం శ్రీనివాసరావు మరియు వినోద్ కలిసి నిర్మించనున్నారు. కొండ కృష్ణం రాజు ఈ సినిమాని సమర్పించనున్నారు. ఈ సంవత్సరం ఆగష్టు నుండి ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా అనూష్కని ఎంపిక చేసినట్లు సమాచారం. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆదిత్య 369' చిత్రం హాలీవుడ్ స్థాయి కథాంశంతో అలనాడే తెలుగు పరిక్షిశమలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది.
ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన బాలకృష్ణ జన్మదినమైన జూన్ 10న వెలువడనున్నట్లు సినీ వర్గాల సమాచారం. 1991లో విడుదలైన 'ఆదిత్య 369' విమర్శకులు ప్రశంసలతో పాటు కమర్షియల్గా భారీ విజయాన్ని సాధించి బాలకృష్ణ కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచిపోయింది. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయగా బాలకృష్ణ అద్భుతాభినయం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇళయరాజా స్వరకల్పనలోని పాటలన్నీ బహూళ ప్రజాదరణ పొందాయి.
ప్రస్తుతం బాలకృష్ణ తన అధినాయకుడు చిత్రం కోసం వెయిట్ చేస్తున్నారు. వచ్చే నెల ఒకటవ తేదీన విడుదల అయ్యే ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రాన్ని ఎమ్.ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. అనేకమైన ఫైనాన్సియల్ క్రైసిస్ మధ్య ఈ భారీ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. పరుచూరి మురళి దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్ తో కూడిన పొలిటకల్ ధిల్లర్ గా సాగుతుందని చెప్తున్నారు.