Don't Miss!
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- News పొత్తుతో పవన్ ఆస్తులు పెరిగాయి - మనోహర్కి స్పోర్ట్స్ కారు..!!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
దిల్ రాజు నిర్మాతగా.. చిరు మేనల్లుడు హీరోగా
చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ హీరోగా వైవియిస్ చౌదరి ఆల్రెడీ రేయ్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తికాకముందే ఈ యంగ్ హీరోకి మరో అవకాశం వచ్చింది. దిల్ రాజు,అడవి సాయి కిరణ్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న కేరింత చిత్రంలోనూ సాయి ధరమ్ తేజనే హీరోగా తీసుకున్నట్లు సమాచారం. మొదట నాగచైతన్యను హీరోగా అనకున్నా డేట్స్ ఎడ్జెస్టు కాకపోవటంతో చాలా లేటయ్యేటట్లు ఉండటంతో సాయి ధరమ్ తేజను తీసుకున్నట్లు తెలుస్తోంది.
వినాయకుడు తో తానేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు సాయి కిరణ్ అడవి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఆ చిత్రం టైటిల్ 'కేరింత'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మై డ్రీం సినిమా బ్యానర్ ఫై దిల్ రాజు, సాయి కిరణ్ అడవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ చిత్రం త్వరలో మొదలు కానుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మిక్కి జే మేయర్ ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
'హ్యాపీ డేస్' చిత్రం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మిక్కీ జె మేయర్ ఆ తరవాత 'కొత్తబంగారు లోకం' చిత్రానికి చేసారు.అనంతరం మళ్లీ శేఖర్ కమ్ములతోనే 'లీడర్' కి చేసారు. 'లీడర్' ఆడియో అనుకున్నంత హిట్ కాకపోవటంతో ఆ తరవాత ఏ సినిమాను కమిట్ కాలేదు. ఇక రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా చెబుతున్న 'కేరింత' సినిమా నటి నటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తిచేసుకుని అక్టోబర్ లో సెట్స్ ఫైకి వెళ్ళనుంది. ఇక దర్శకుడు అడవి సాయికిరణ్ ..విలేజ్ లో వినాయకుడు చిత్రం అనంతరం ఏ సినిమానూ చేయలేదు. ఇక ఈ చిత్రానికి కెమెరామెన్ గా కుదిరితే కాఫీ కప్పు చిత్రాన్ని డైరక్ట్ చేసిన రమణ సెల్వా పనిచేయనున్నారు.
రేయ్ చిత్రం విషయానికి వస్తే...ఇప్పటికే ఈచిత్రానికి సంబంధించిన కొంత భాగాన్ని లాస్ వెగాస్, అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో చిత్రీకరించారు. వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రానికి చక్రి సంగీతం అందిస్తుండగా, గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. 2012 చివరికల్లా వైవిఎస్ ఈచిత్రాన్ని పూర్తి చేయడానికి ప్రత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా సయామీ ఖేర్ అనే అమ్మడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. అదే విధంగా హీరోయిన్ శ్రద్ధాదాస్ ఈ చిత్రంలో కీ రోల్ పోషిస్తోంది.