Don't Miss!
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘గుండమ్మ కథ’ రీమేక్ లో శ్రీదేవి?
గుండమ్మ కథ'రీమేక్ విషయమై అక్కినేని మీడియాతో మాట్లాడుతూ... అప్పట్లో నాగార్జున,బాలకృష్ణ ఆ రీమేక్ చేద్దామని ట్రై చేయటం మాత్రం నిజం. కానీ గుండమ్మ చేసే వారు దొరకక ఆగిపోయారు. దాంతో ఆ ఆలోచన విరమించుకున్నాం. ఇప్పుడు వాళ్లు యాభైల్లో పడ్డారు. ఇప్పుడు చేయటం కష్టం. యంగ్ జనరేషన్ హీరోలు జూ.ఎన్టీఆర్,నాగచైతన్య ఆ రోల్స్ కి బెస్ట్ అని తేల్చి చెప్పారు.
ఇక 'గుండమ్మ కథ' విషయానికి వస్తే...భారతదేశంలో వంద సినిమాలు పూర్తి చేసిన తొలి హీరోగా ఈ చిత్రంతో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. ఆ తరువాతి స్థానం అక్కినేనిదే. ఆయనకు ఇది 99వ సినిమా. వీరిద్దరూ కలిసి నటించిన పదో సినిమా ఇది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా తయారైంది. అక్కడ చక్రపాణి డెరైక్ట్ చేశారు. ఎన్టీఆర్ పాత్రను జెమినీ గణేశన్ పోషించగా, ఏయన్నార్, సావిత్రి, జమున తమ పాత్రలు తామే చేశారు.
శ్రీదేవి మళ్లీ తెలుగు సినిమాల్లో నటించబోతోందని చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఏదీ కూడా కన్ఫర్మ్ కాలేదు. ఇటీవల మంచు ఫ్యామిలీ తీసే ఓ చిత్రంలో మండోదరి పాత్రకు ఆమెను సంప్రదించినట్లు వార్తలు వచ్చినా అదంతా అవాస్తవమని మోహన్ బాబు కొట్టి పారేశారు.