Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నవదీప్ బాలీవుడ్ ఎంట్రీ?
హైదరాబాద్: దక్షిణాదికి చెందిన చాలా మంది సినీ స్టార్లు, టెక్నీషియన్లు బాలీవుడ్లో తమ లక్కు పరీక్షించుకునేందుకు ఉబలాట పడుతున్న సంగత తెలిసిందే. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ ను టచ్ చేసి వచ్చినా లక్కు మాత్రం కొందరికే కలిసొచ్చింది. తాజాగా తెలుగు యంగ్ హీరో నవదీప్ కూడా బాలీవుడ్ అవకాశాల కోసం ట్రై చేస్తున్నాడట. తెలుగులో నవదీప్ ఇప్పటికే పలు చిత్రాల్లో హీరోగా, మరికొన్ని సినిమాల్లో సెకండ్ హీరోగా చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఈ హీరో బాలీవుడ్ సినిమాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. మరి నవదీప్ ఆశ ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.
తేజ పరిచయం చేసిన హీరోల్లో ఉదయ్ కిరణ్, నితిన్ తర్వాత ఎంతో కొంత పేరు తెచ్చుకున్న హీరో నవదీప్. 'జై'తో నిరాశాజనకంగా కెరీర్ ఆరంభించిన నవదీప్కు 'గౌతం ఎస్.ఎస్.సి.' సినిమా కాస్త ఊపిరినిస్తే, కృష్ణవంశీ తీసిన 'చందమామ' ప్రాణం పోసింది. అయితే వాటి తర్వాత అతను హీరోగా చేసిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. అల్లు అర్జున్ సినిమా 'ఆర్య 2'లో యాంటీ హీరోగా తన నటనతో మెప్పించినా ఎందుకనో అతడికి హీరోగా సరైన అవకాశాలు రాలేదు.
'ఓం శాంతి', 'యాగం', 'ఆకాశమే హద్దు', 'ముగ్గురు' సినిమాలు ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించలేకపోయాయి. ఆఖరుకి సిద్ధార్థ్ సినిమా 'ఓ మై ఫ్రెండ్'లో సెకండ్ హీరోగా చేసినా ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. అయినప్పటికీ అతడు అడపాదడపా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. అదీ వివాదాల ద్వారా. ఓసారి తాగి డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ అతను ఇంకోసారి గర్ల్ ఫ్రెండ్స్తో గోదావరిలో విహారానికి వెళ్లి నది మధ్యలో పడవ ఆగిపోవడంతో విషయం బయటకు పొక్కింది.
ఆ తర్వాత హైదరాబాద్లో ఓ పబ్వద్ద ఇద్దరు కుర్రాళ్లను కొట్టినట్లు అతనిపై కేసు నమోదైంది. ప్రస్తుతం నవదీప్ మైత్రి అనే చిత్రంలో నటిస్తున్నాడు. నవదీప్ సరసన సదా హీరోయిన్గా చేస్తోంది. రాజు దర్శకుడిగా పరిచయం అవుతుండగా వికాస్ సంగీతం అందించబోతున్నాడు. ఈ చిత్రంతో పాటు వసూల్ రాజా, బాద్ షా చిత్రాల్లో నవదీప్ నటిస్తున్నాడు.