Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పూరీ జగన్నాథ్ రిజిస్ట్రేషన్ చేసిన కొత్త టైటిల్
మోహన్ బాబు హీరోగా చేసిన 'అసెంబ్లీ రౌడీ'ఆ రోజుల్లో సూపర్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రీమేక్ చేస్తారని చాలా కాలం నుంచి వినపడుతోంది. అయితే రకరాల దర్శకులనుప అనుకున్నప్పడికీ పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడుగా ఎంచుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
ఇక ఈ చిత్రంలోని అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే నిన్ను కూడా జైల్లోపెడతా... అనే డైలాగులు అప్పట్లో ఎక్కడ విన్నా వినపడేవి. దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ఈ 'అసెంబ్లీ రౌడీ'చిత్రం రీమేక్ కాబోతోంది. మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా ఈ చిత్రం రూపొందనుంది.ఈ చిత్రాన్ని లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది.
ఈతరానికి నచ్చేలా, వర్తమాన పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని మార్పుచేర్పులు చేస్తున్నారు. ప్రస్తుతం కథాచర్చలు సాగుతన్నాయి. విష్ణు హీరోగా తెరకెక్కుతున్న 'దూసుకెళ్తా' చిత్రీకరణ తుది దశకు చేరింది. ఈ చిత్రం పూర్తయిన తరవాత 'అసెంబ్లీ రౌడీ' సెట్స్ మీదకు వెళ్ళే అవకాసం ఉందని తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ ఈ మేరకు కొత్త స్క్ర్రిప్టుని రెడీ చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలో 'అందమైన వెన్నెలలోన'పాటని సైతం రీమిక్స్ చేస్తారని తెలుస్తోంది.