Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హాట్ టాపిక్: రేణుదేశాయ్ దెబ్బకు యూనిట్ పరార్
రేణు దేశాయ్. .షూటింగ్ స్పాట్ లోకి వ్చచి చాలా కోపంగా మారిపోయి అందరనీ కామెంట్స్ చేస్తూ విమర్శిస్తోందని చెప్తున్నారు. ఈమె కోపానికి తట్టుకోలేక, ఈ సినిమా అసెస్టెంట్ డైరక్టర్ తేజస్ కులకర్ణి, అలాగే సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీరంగ్ ఇప్పటికే ప్రాజెక్టునుంచి తప్పుకున్నారని ఓ పాపులర్ ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది. అంతేగాక ఈ సినిమాకు కెమెరామెన్ గా పనిచేస్తున్న పూజ గుప్తే కూడా ఈ సినిమాకు నమస్కారం చెప్పిందని చెప్తున్నారు.
ఇక ఈ చిత్తరం భార్యాభర్తల అనుబంధం చుట్టూ తిరిగే కథ. ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ... '' నేను నిర్మాతగా మారటమనేది నిజమే... పుణెలో పుట్టి పెరిగాను. మరాఠీ నాటక రంగం ఎప్పుడూ మంచి స్థితిలో ఉంటోంది. అయితే ఇక్కడి సినిమా మాత్రం కొంత వెనకబడే ఉంది. నేను నిర్మాతగా తీసే తొలి చిత్రం మరాఠీలోనే కావడం సంతోషము'' అని రేణు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పుణెలో సాగుతోంది. స్వప్నిల్ జోషి, ముక్తా భార్వే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రేణు తొలిసారి తెలుగులో పవన్కల్యాణ్ సరసన 'బద్రి'లో నటించారు. ఆ తరవాత పవన్ దర్శకత్వం వహించిన 'జానీ'లోనూ ఆమే హీరోయిన్ . ఆ తరవాత పవన్ నటించిన కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరించారు.