Don't Miss!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! రంగంలోకి ఆ ముగ్గురు..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
అనుష్క ఓకే అందా సరే...డైరక్టర్ ఎవరూ?
హైదరాబాద్: ఇప్పటికే భారీ పీరియడ్ చిత్రాలు బాహుబలి, రుద్రమదేవి చేస్తూ బిజీగా ఉన్న అనుష్క మరో పీరియడ్ చిత్రం కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్తలు మీడియాలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. తారామతి టైటిల్ తో ఓ చారిత్రక చిత్రం చేయనున్నారని వినిపిస్తోంది. మిర్చి, ఇటీవల రన్ రాజా రన్ చిత్రాలు నిర్మించిన యువి క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని చెప్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభమైందని త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశముందని చెప్పుకుంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ ఈ ప్రాజెక్టుకు దర్శకుడు ఎవరనేది మాత్రం చెప్పటం లేదు.
కొత్త వారికి ఇంతంత భారీ బడ్జెట్ సినిమాలు అప్పచెప్పరు. అలాగని మన దర్శకులలో చారిత్రిక చిత్రాలు తీయాలన్న అభిరుచి, తీయగల సత్తా ఉండి ప్రస్తుతం ఖాళీగా ఉన్న దర్శకులు ఎవరున్నారు. ఇంతేకాకుండా ప్రభాస్ ఈ చిత్రంలో గెస్ట్ గా చేయనున్నారని అంటున్నారు. తన స్నేహితులు నిర్మాతలు కాబట్టి, అనుష్క తో ఉన్న అనుబంధంతో ఒప్పుకోవచ్చు కానీ అనుష్క,ప్రభాస్ లకు అంత తీరిక ఎక్కడది..ఈ సందేహాలన్నీ ఈ విషయమై అఫీషయల్ మీడియా నోట్ వస్తే కానీ తేలదు. అయితే ఇప్పటిదాకా అలాంటిదేం లేదు.
ఇంతకు ముందు కూడా అనుష్క తో ...భాగమతి చిత్రం చేయనున్నారనవి వార్తలు వచ్చాయి. పిల్ల జమీందారు అశోక్ ఈ చిత్రం ప్లాన్ చేసాడని చెప్పుకున్నారు. కానీ అది పట్టాలు ఎక్కలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ తారామతి వార్త ఎంతవరకూ నిజం అవుతుందనేది చూడాలి. అనుష్క మాత్రం తన తమిళ, తెలుగు చిత్రాల్లో బిజీగా ఉంది. తెలుగులో రెండు చిత్రాలు మొదట ఫినిష్ చేసి తమిళంలో బిజి అవ్వాలనే ఆలోచన ఆమెలో కనపడుతోంది.