Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఇదో టెన్షన్: మహేష్ అక్కడితో సరిపెడతాడా లేక...
హైదరాబాద్: ఇప్పుడు అందరి దృష్టీ మహేష్ బాబు మీదే ఉంది. రాజకీయాలంటే పడదని ఎప్పుడూ దూరంగా ఉండే ఆయన తన బావ కోసం ట్విట్టర్ ద్వారా ప్రచారంలోకి దిగారు. గుంటూరు లోక్సభ స్థానం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా జయదేవ్కు మహేష్బాబు మద్దతు ప్రకటించారు. తన ఓటు తన బావకే అని, మీరు కూడా వేయండంటూ తన ఫ్యాన్స్ తో అన్నాడు. దాంతో తెలుగుదేశంకు మహేష్ సపోర్టు ఇచ్చినట్లు అయ్యింది.
అక్కడదాకా బాగానే ఉంది..ఇప్పుడు ఆయన నియోజక వర్గంలో దిగి ప్రచారం చేస్తాడా చెయ్యడా...కేవలం ట్వీట్స్ ప్రచారంతో సరిపెడతాడా అనేది మిగతా పార్టీలకు చర్చనీయాంశంగా మారింది. మహేష్ ప్రచారానికి వస్తున్నాడంటే మిగతా పార్టీలు ఎలా దానికి ప్రతిస్పందించాలి,ఏ విధంగా దానిని ఎదుర్కోవాలి అనే విషయంపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం. అతని స్టార్ పవర్ కి ఎదురు వెళ్లేదెవరు అని ఆలోచనలో పడుతున్నారు. మరో ప్రక్కన ఆయన డేట్స్ తీసుకున్న ిరి
మహేష్ ఇచ్చిన ట్వీట్ లో ... ''నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను. మా బావ జయదేవ్ గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నందున ఆయన గురించి మాట్లాడుతున్నా. మా అక్క పద్మతో ఆయన వివాహం అయినపుడు నా వయసు 13. జయదేవ్ అప్పట్నుంచి నాతో ఎంతో చనువుగా, అభిమానంగా ఉండేవారు.
అమరరాజా గ్రూప్, అమరాన్ బ్రాండ్ ఈ స్థాయికి చేరుకోవడానికి జయదేవ్ కృషి, పట్టుదల, విలువలే కారణం. నాకు ఆయనపై నమ్మకం ఉంది. ఆయన మార్పు తీసుకురాగలరన్న నమ్మకం ఉంది. నా మద్దతు, నా ఓటు ఆయనకే. మీ మద్దతు, మీ ఓటు ఆయనకేనని ఆశిస్తున్నా'' అని మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్'లో మహేశ్ రాశారు.
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే... మహేష్బాబు - శ్రీనువైట్ల కలయిక మరోసారి 'ఆగడు' సినిమాతో పునరావృతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పోలీసు పాత్రతో మరోసారి ప్రతాపం చూపించబోతున్నారు మహేష్బాబు. ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. 'ఆగడు'లో ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.