Don't Miss!
- News ఘర్ వాపసీ: రేవంత్ రెడ్డిని కలిసిన కేకే, కేసీఆర్ గౌరవం ఇచ్చారు కానీ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
నిజమా, మహేష్ కూడా ఫ్యాక్షనిజమా?
ఫ్యాక్షనిజం అనేది తెలుగు భాక్సాఫీస్ లో బాగా సక్సెస్ అయిన ఫార్ములా. దాదాపు ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన పెద్ద చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి. ఇప్పుడు 'ఆగడు' కథ కూడా రాయలసీమ లోని ఆనంతపూర్ జిల్లా తాడిపత్రి గ్రామం బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని అంటున్నారు. ఇందునిమిత్తం అనంతపురం తాడిపత్రి సెట్ ని గుజరాత్ లో వేసి షూట్ చేస్తున్నారు. తాడిపత్రిలో షూట్ చేస్తే క్రౌడ్ ని కంట్రోల్ చేయటం కష్టమని అక్కడ శ్రీను వైట్ల ఇలా ప్లాన్ చేసాడంటున్నారు. జనవరి 18 నుంచి భారీ షెడ్యూల్ ఇక్కడ జరగనుంది.
శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆగడు'. మహేష్బాబు హీరో. తమన్నా హీరోయిన్. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ''మహేష్బాబు నుంచి అతని అభిమానులు, ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. మహేష్ పాత్రని దర్శకుడు వైవిధ్యంగా తీర్చిదిద్దారు. ''అన్నారు. సంగీతం: ఎస్.ఎస్. థమన్, ఛాయాగ్రహణం: కె.వి.గుహన్, కళ: ఎ.ఎస్.ప్రకాశ్, కూర్పు: ఎం.ఆర్.వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి.