Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ అదే పనిమీద ఉన్నాడు...డోంట్ వర్రీ
హైదరాబాద్ : పవన్ కల్యాణ్ ఓ పని చేపట్టారంటే మిస్టర్ ఫెరఫెక్ట్ తరహాలో దాన్ని అన్ని కోణాలనుంచి పరిశీలించి, చాలా పద్దతిగా, క్రమశిక్షణతో రాత్రింబవళ్లూ పనిచేస్తూ...దాని అంతుచూసేదాకా నిద్రపోరు అని ఆయనతో పనిచేసినవాళ్ళు చెప్తూంటారు. దాంతో ఆ పనులు కొద్దిగా ఆలస్యమైనా చాలా మంచి ఫలితాలను ఇస్తూంటాయి. ఈ లక్షణమే ఆయన్ను పవర్ స్టార్ ని చేసి నిలబెట్టింది. ఇప్పుడు 'గబ్బర్ సింగ్ 2' విషయంలోనూ అదే జరుగుతోందిట. ఆయన తన పూర్తి దృష్టిని ఏకాగ్రతని దానిపైనే పెట్టారని చెప్తున్నారు. ముఖ్యంగా ఆయన ఈ చిత్రానికి కథ,స్క్ర్రీన్ ప్లే రాయటంలో నిమగ్నమయ్యారట.
'గబ్బర్ సింగ్' సీక్వెల్కి రంగం సిద్ధమవుతోంది. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంపత్నంది దర్శకుడు. 'గబ్బర్ సింగ్ 2' స్క్రిప్టు విషయంలో పవన్ చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. కథ, స్క్రీన్ ప్లే విషయంలో తనే స్వయంగా రాస్తూ, దాన్ని అందంగా చెక్కుతున్నారు. ప్రస్తుతం 'గోపాల గోపాల' షూటింగ్తో బిజీగా ఉన్నాడు పవన్.
ఈ మల్టీస్టారర్ పూర్తవ్వగానే 'గబ్బర్ సింగ్ 2'కి కాల్షీట్లు కేటాయించనున్నాడు. అక్టోబర్ ద్వితీయార్థంలో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది. ఈలోగా.. పవన్ దగ్గరుండి స్క్రిప్టు పనులు చూసుకొంటున్నాడు. మరోవైపు కథానాయిక, సాంకేతిక నిపుణుల ఎంపికా జరుగుతోంది. పవన్ సరసన కథానాయిక ఎవరనే సంగతి ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది.
గతంలో పవన్ తన సినిమాల్లో యాక్షన్ దృశ్యాలను తానే డిజైన్ చేసుకున్నాడు. 'ఖుషి'తో కొరియోగ్రాఫర్ అవతారం ఎత్తాడు. 'కాటమరాయుడా..' అంటూ గొంతెత్తిన సందర్భాలున్నాయి. స్క్రీన్ ప్లే విద్యా తెలుసు. 'జానీ'తో దర్శకుడూ అయ్యాడు. ఇప్పుడు 'గబ్బర్ సింగ్ 2' విషయంలోనూ తన ఆలోచనల్ని జోడిస్తూ ఉండటంతో ఖచ్చితంగా ఈ సీక్వెల్ అద్బుతంగా తయారవుతుందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.
'రచ్చ'తో బాక్సాఫీసు దగ్గర సందడి చేసిన సంపత్నంది దర్శకత్వం వహించే చిత్రమిది. శరత్మరార్ నిర్మాత. ''గబ్బర్ సింగ్ కథకూ.. ఈ కథకూ సంబంధం ఉండదు. కానీ ఆ తిక్క మాత్రం ఉంటుంది. అభిమానులకు రెట్టింపు వినోదం అందిస్తాం. స్క్రిప్టు సిద్ధమైంది. కథానాయిక ఎంపిక జరుగుతోంది. పవన్ పచ్చజెండా వూపగానే చిత్రీకరణను మొదలుపెట్టేస్తాం'' అని సంపత్నంది చెబుతున్నారు.
హరీశ్శంకర్ దర్శకత్వంలో పవన్కల్యాణ్ నటించగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన 'గబ్బర్సింగ్'కు ఇది ప్రాంచైజీ ఫిల్మ్. ఈచిత్రం సీక్వెల్,ప్రీ క్వెల్ కాదనీ ప్రాచైజీ గా ఫ్రెష్ స్టోరీ తో వచ్చే చిత్రం అని సంపత్ నంది చెప్తున్నారు. అలాగే హీరోయిన్ ఎవరనేది త్వరలోనే చెప్తామన్నారు. స్క్రిప్టు వర్క్ పూర్తై మిగతా పనులు వేగంగా జరుపుతున్నట్లు సమాచారం. మరో ప్రక్క ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. సోనాక్షి సిన్హా, కాజల్ అగర్వాల్ అనుకున్నప్పటికీ వారిద్దరికీ డేట్స్ ప్రాబ్లమ్ తో తప్పుకున్నట్లు చెప్తున్నారు.