Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పవన్ కళ్యాణ్ దారి హీరోలిద్దరికీ దెబ్బకొట్టింది
హైదరాబాద్ : తెలుగులో ఓ సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే అందరూ అలాంటి కథతోనే చిత్రాలు తయారు చేయాలని ఉత్సాహపడిపోతారు. దాంతో దాదాపు అన్ని కథలూ అదే మూసలో తయారవుతూంటాయి. ఫలితం ఏ సినిమాను సరిగా ఆడదు. అన్ని తెలిసిన కథలులాగానే కనిపించి ఆసక్తి రేపవు. ఇప్పుడు రామ్ కు, రామ్ చరణ్ కు అదే సమస్య ఎదురౌతోందని అంటున్నారు.
వీరిద్దరూ అత్తారింటికి దారేది హిట్ కథ ఇచ్చిన ప్రేరతో సినిమాలు రెడీ చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు ఫిల్మ్ నగర్ వాసులు. ట్రీట్ మెంట్ తేడా ఉంటుందేమో కానీ కథ,కథనం ఒకేలాగ ఉన్నాయి...అందుకే ఇద్దరూ తమ తమ కథనాలును కొద్దిగా మార్చుకుంటున్నారు అని చెప్పుకుంటున్నారు. రామ్ పండగ చేస్కో, రామ్ చరణ్...గోవిందుడు అందరి వాడేలా చిత్రాలలో హీరోలు...ఎన్నారైలు. వాళ్లు తమ స్వగ్రామాలుకు వచ్చి విడిపోయిన తమ కుటుంబాలను కలుపే లక్ష్యంగా పనిచేస్తూంటారని తెలుస్తోంది. దాంతో ఇప్పుడు పండుగ చేస్కో టీమ్ ...గ్యాప్ తీసుకుని కథని సరిచేసుకునే పనిలో పడిందని చెప్తున్నారు.
రామ్ హీరోగా రూపొందుతున్న 'పండగ చేస్కో' లో రామ్ ...ఎన్నారై గా కనిపిస్తాడని, అతను తన కుటుంబ సమస్య పరిష్కరించటానికి ఇండియా వస్తాడని తెలుస్తోంది. ఫస్టాఫ్ అత్తారింటికి దారేది,సెకండాఫ్ ...మిర్చిని గుర్తుకు తెస్తూ సాగుతుందని వినిపిస్తోంది. అయితే ఇది రూమరా లేక నిజమా అని తేలాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాల్సింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ హీరో. రకుల్ ప్రీత్సింగ్ హీరోయిన్. పరుచూరి కిరీటి నిర్మాత.
దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ... డాలర్లలో మునిగి తేలిన కుర్రాడతను. కోరుకొంటే విలాసవంతమైన జీవితం అతని కాళ్ల ముందు ఉంటుంది. కానీ అదేం వద్దనుకొన్నాడు. తన వాళ్ల కోసం స్వదేశానికి వచ్చేశాడు. ఇక్కడికొచ్చి ఏం చేశాడో తెలియాలంటే మా చిత్రం చూడాలి అంటున్నారు . ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పండగ చేస్కో'.
అలాగే ''రామ్ ఎనర్జీని పూర్తి స్థాయిలో తెరపై చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. రకుల్ పాత్ర కూడా అదే స్థాయిలో ఉంటుంది. హీరో,హీరోయిన్స్, బ్రహ్మానందం కలసి తెరపై పండించే వినోదం ప్రేక్షకులను అలరిస్తుంది'' అన్నారు. రామ్ మాట్లాడుతూ ''చాలా రోజుల నుంచి కష్టపడి చేసుకున్న కథ ఇది. మా చిత్రబృందం ఎంతో మనసు పెట్టి చేస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ... ''తనవారి శ్రేయస్సు కోసం పాటుపడే కుర్రాడి కథ ఇది. ప్రతి సన్నివేశం ఓ పండగలా ఉంటుంది. రామ్ నటన, డ్యాన్స్, పోరాటాలూ.. తప్పకుండా ఆకట్టుకొంటాయి. సాయికుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్తో సినిమా చేయాలని గత నాలుగేళ్లగా ప్రయత్నించాను. ఈ కథ నా దగ్గరకు వచ్చేసరికి పరిశ్రమ పరిస్థితి బాగాలేదని ఆలోచించాను. అయితే కథ బాగా నచ్చేసరికి ముందడుగు వేశాను'' అన్నారు.
సోమవారం నుంచి హైదరాబాద్లో చిత్రీకరణ మొదలుకానుంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. చిత్రంలో సాయికుమార్, రావు రమేష్, జయప్రకాశ్రెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్థర్ ఎ.విల్సన్, సంగీతం: తమన్, కూర్పు: గౌతంరాజు, కళ: ఎ.ఎస్.ప్రకాశ్