Don't Miss!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘బాహుబలి’ సెకండ్ పార్ట్ స్టోరీ లీకైందా?
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బాహుబలి' చిత్రం రెండు పార్టులుగా చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సెకండ్ పార్ట్ స్టోరీ లీకైందనే న్యూస్ ఇపుడు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. ఆ వార్తల ప్రకారం... రాజమాత(రమ్య కృష్ణ) శతృవుల బారి నుండి తన బిడ్డను కాపాడి నదిలో వదిలేస్తుందని, ఆ చిన్నారి పెరిగి శివుడు(ప్రభాస్)అవుతాడని, తర్వాత శివుడు శత్రవులపై రివేంజ్ తీర్చుకుని తన రాజ్యాన్నీ గెలుచుకుంటాడట.
ఇదేదో పాత సినిమా స్టోరీలాగా ఉంది కదూ. ఇందులో నిజమెంతో తెలియదుకానీ....ఇలాంటి వార్తలు 'బాహుబలి' సినిమాకు మరింత పబ్లిసిటీ పెంచుతున్నాయి. బాహుబలి చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంకా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, అడవి శేష్, సందీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి మొదటి పార్ట్ 2015లో థియేటర్లోకి వస్తుందని అంటున్నారు.
ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీలో పాటు విదేశీ బాషల్లో కూడా విడుదల చేస్తారట. రెండు పార్ట్స్ కాబట్టి పెట్టిన పెట్టబడి గ్యారంటీగా తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకైతే రాజమౌళి అంచనాలు తప్పలేదు. ఏది చేసినా ముందు దాని గురించి క్షుణ్ణంగా స్టడీచేసి పర్ఫెక్టుగా చేయడం ఆయన స్టైల్. మరి రాజమౌళి ప్రయత్నం సక్సెస్ అయి తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని ఆశిద్దాం.