twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ ‘గోపాలా గోపాలా’: స్వామీజీగా సాయి కుమార్?

    By Bojja Kumar
    |

    Sai Kumar Replaces Mithun In Gopala Gopala
    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో 'గోపాలా గోపాలా' టైటిల్‌తో మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త వెలుగులోకి వచ్చింది. నటుడు సాయి కుమార్ ఈ చిత్రంలో స్వామిజీ పాత్ర చేయబోతున్నాడట.

    ఒరిజినల్ వెర్షన్ 'ఓ మై గాడ్'లో కీలకమైన స్వామిజీ పాత్రలో హిందీ నటుడు మిథున్ చక్రవర్తి నటించారు. తెలుగులో కూడా ఆ పాత్రలో మిథున్ చేత నటింపచేయాలనుకున్నాకు కానీ...అతని డేట్స్ దొరకక పోవడంతో సాయి కుమార్‌ను తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

    ఈ చిత్రంలో వెంకీ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకుడు. హిందీలో విజయవంతమైన 'ఓ మైగాడ్‌'కిది రీమేక్‌. అందులో పరేష్‌ రావల్‌ పోషించిన పాత్రను ఇక్కడ వెంకటేష్‌, అక్షయ్‌ కుమార్‌ చేసిన కృష్ణుడు పాత్రను పవన్‌ కల్యాణ్‌ చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని...కృష్ణాష్టమి (ఆగస్టు 16) రోజు విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సినిమా 2015 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

    సురేష్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, దీక్షాపంత్‌, అంజు అస్రాని తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి.

    English summary
    The latest buzz is that Mithun is likely to be replaced by Sai Kumar for the role as the former has issues with dates.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X