Don't Miss!
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Finance Adani-Birla: అదానీని టార్గెట్ చేసిన బిర్లా.. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కొనుగోలు..
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చెక్ బౌన్స్ అయ్యేంతలా ఖర్చు పెట్టిందా?
హైదరాబాద్ : 'గబ్బర్సింగ్' విజయంతో వరుస అవకాశాలు అందుకొంది శ్రుతిహాసన్. 'బలుపు', 'ఎవడు', 'రామయ్యా వస్తావయ్యా'లాంటి భారీ చిత్రాలు చేసింది. 'బలుపు' , 'ఎవడు' విజయం సాధించింది. అలా మంచి జోరు మీద ఉన్న శృతి ఫైనాన్సియల్ గానూ మంచి స్ట్రాంగ్ గానే ఉంటుందని భావిస్తారు. అయితే ఆమె ఇచ్చిన చెక్ ..ఈ మధ్యన బౌన్స్ అయ్యిందని ముంబై వర్గాల సమాచారం. ఈమె ముంబై లో ఇల్లు కొనుక్కుందని అందుకోసం ఆమె డబ్బు ఎడ్జెస్ట్ చేసే ప్రాసెస్ లో చెక్ ఇచ్చిందని అది బౌన్స్ అవటంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. అయితే శృతి హాసన్ చెక్ బౌన్స్ అవటమేంటి...అని ఆమె సన్నిహితులు ఆశ్చర్యపోతున్నారు.
ఇక ప్రస్తుతం అర్జున్ రామ్పాల్, శ్రుతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం 'డి డే'. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించారు. శృతి హాసన్ వేశ్య పాత్రను పోషించింది. అర్జున్ రామ్పాల్ - శ్రుతిల మధ్య ఘాటైన సన్నివేశాలున్నాయి. ఈ చిత్రాన్ని 'గెలుపు గుర్రం' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు సురేష్ దూడల.
ఆయన మాట్లాడుతూ ''మాఫియా నేపథ్యంలో సాగే కథ ఇది. శ్రుతిహాసన్ వేశ్యగా నటించింది. ఆమె పాత్ర యువతరాన్ని ఆకట్టుకుంటుంది. ఇందులో గెలుపు గుర్రం ఎవరన్నది తెరపైనే చూడాలి. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాము'' అన్నారు.
అప్పట్లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ హాట్ టాపిక్ గా మారి సినిమాకు బోల్డ్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు దాన్నే క్యాష్ చేసుకుందామనే ఆలోచనతోనే నిర్మాతలు తెలుగులో డబ్బింగ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. గతంలో తమిళంలో డబ్బింగ్ అవబోతే శృతి హాసన్...కోర్టు...కేసు లు అంటూ సీరియస్ అయ్యింది. ఇప్పుడు అదే పరిస్ధితి తెలుగులోనూ రాబోతోందా అంటున్నారు. ఇప్పుడిప్పుడే తెలుగులో హిట్ లు తెచ్చుకుంటూ దూసుకుపోతున్న ఆమె ఈ సినిమాతో తన ఇమేజ్ దెబ్బ తింటుందేమోనని భయపడుతోంది అంటున్నారు.
నిఖిల్ అద్వాని దర్శకత్వంలో శ్రుతి హాసన్ నటించిన 'డి-డే' సినిమాలో ఆమె నటనకుగానూ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. అర్జున్ రాంపాల్, ఇర్ఫాన్ ఖాన్ , హ్యుమా ఖురేషి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. శృతిహాసన్ ఒక ముఖ్యమైన పాత్రపోషించింది. కరాచీ ప్రాంతానికి చెందిన ఒక వేశ్య పాత్రలో ఆమె కనిపించనుంది. ఈమె హీరోతో ప్రేమలో పడినతరువాత కధ ఏ విధంగా మలుపుతిరిగింది అనేది ఆసక్తికరంకానుంది. శృతి కనిపించేది కొద్దిసేపే అయినా ఆమె పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది.
'డి-డే' గురించి శ్రుతి మాట్లాడుతూ ''కథ ప్రకారం చిత్రానికి ఏ సన్నివేశాలు అవసరమో వాటిలో కనిపించాను. నా పాత్ర సవాలుతో కూడుకొన్నది. అందుకే దర్శకుడు కథ వినిపించినపుడు ఎలాంటి ఆలోచన చేయకుండా నటించేందుకు అంగీకరించాను'' అని తెలిపింది. ఇందులో ఇర్ఫాన్ఖాన్, రిషి కపూర్, అనిల్ కపూర్, నాజర్, హ్యూమా ఖురేషి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: శంకర్-ఎహసాన్-లాయ్.