Don't Miss!
- News ఎన్నికల్లో కీలక ఘట్టం ..నేటి నుంచే నామినేషన్లు షూరూ
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
కమల్ కథ ఓకే చేసాడంటూ మరో తెలుగు డైరక్టర్
హైదరాబాద్ : ఆ మధ్యన దర్శకుడు ఎన్.శంకర్ తాను కమల్ హాసన్ కి కథ చెప్పానని, త్వరలోనే సినిమా చేయబోతున్నట్లు ఇంటర్వూలలో ఊదరకొట్టి తర్వాత దాని ఊసే ఎత్తకుండా ఊరుకున్నారు. ఇప్పుడు మళ్లీ తేజ రీసెంట్ గా కమల్ హాసన్ ని బెంగళూరు వెళ్లి కలిసి కథ చెప్పాడని, ఆయనకు తెగ నచ్చిందని, త్వరలోనే పట్టాలు ఎక్కబోతున్నట్లు మీడియాకు వార్తలు మొదలయ్యాయి. అదీ మూడు భాషల్లో, హాలీవుడ్ టెక్నీషియన్స్ అని చెప్తున్నారు.
ఇది విన్న కొంత మంది తేజకు మంచి రోజులు మొదలయ్యాయి అంటూంటే...మరికొంత మంది కమల్ హాసన్ అంతలా దర్శకుల లేమితో భాధపడుతున్నాడా అంటున్నారు. ఆయన్ని డైరక్ట్ చేయటానికి తెలుగు నుంచి వచ్చే ఫ్లాఫ్ దర్శకులు తప్ప వేరే వారు లేరని ఫిక్స్ అయ్యారా అని కామెంట్ చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పట్టాలు ఎక్కుతాయో లేవో కానీ కమల్ హాసన్ నేమ్ డ్రాపింగ్ తో మాత్రం వార్తలలో ఉంటారనేది మాత్రం నిజం అంటున్నారు సినీ జనం.
ఇక కమల్ హాసన్ ప్రస్తుతం బెంగళూరులో ఉత్తమవిలన్ షూటింగ్ లో బిజిగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తయ్యాక దృశ్యమ్ చిత్రం రీమేక్ చేస్తారు. రోజురోజుకూ వేగాన్ని పెంచుతున్న ఆయన ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రేక్షకులను ఆకట్టుకున్న 'విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్గా కమల్ నటించిన 'విశ్వరూపం-2' ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం మేలో ప్రేక్షకుల చెంతకు రానుంది.
తన స్నేహితుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో కమల్హాసన్ నటిస్తున్న 'ఉత్తమ విలన్' చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభమయి శరవేగంగా కొనసాగుతోంది. దీని చిత్రీకరణను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారట రమేష్ అరవింద్. సెప్టెంబరులో చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు నిశ్చయించారట. కమల్ నటించనున్న మూడో చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదల అవుతుందని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
మలయాళంలో సంచలన విజయం సాధించిన 'దృశ్యం' రీమేక్లో కమల్ నటించనున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటించేందుకు మీనా, నదియా, సిమ్రాన్ తదితర పేర్లు పరిశీలనకు వచ్చినా చివరకు గౌతమిని ఎంపిక చేసినట్లు సమాచారం. 'ఉత్తమ విలన్' చిత్రీకరణ పూర్త్తెన వెంటనే ఆగస్టులో 'దృశ్యం' రీమేక్ను సెట్స్పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. చిత్రీకరణకు ఎక్కువరోజులు పట్టే కథ కాకపోవటంతో త్వరగానే పూర్తి చేసి డిసెంబరులోగా విడుదల చేయనున్నట్లు తెలిసింది.