Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
పనిలో పనిగా రవితేజ పెంచేసాడు
హైదరాబాద్: సినిమాలు తమ పేరు చెప్పి బిజినెస్ అవుతున్నప్పుడు హీరోలు రెమ్యునేషన్స్ పెంచటంలో తప్పులేదని ఇండస్ట్రీ పెద్దలు అంటూ అమలు పరుస్తూంటారు. రవితేజ కూడా ఆ సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్నట్లున్నాడు. తన రెమ్యునేషన్ విషయంలో పెంచాల్సిందే అని నిర్ణయానికి వచ్చాడు. తన తాజా చిత్రం పవర్ ..బిజినెస్ 30కోట్లు అవటంతో వెంటనే తన తదుపరి చిత్రానికి 8 కోట్లు వసూలు చెయ్యాలని నిర్ణయించుకుని,అమలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా.
రవితేజ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం 'పవర్'. హన్సిక హీరోయిన్ . కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబి) దర్శకుడుగా పరిచయమవుతున్నారు. రాక్లైన్ వెంకటేష్ నిర్మాత. తమన్ అందించిన ఈ చిత్రం ఆడియోని రీసెంట్ గా విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రం నిమిత్తం విడుదల చేసిన రెండు టీజర్స్ డిస్టిబ్యూటర్స్ ని బాగా ఎట్రాక్ట్ చేయంటంతో ఎంక్వైరీలు ఊపందుకున్నాయని అంటున్నారు. పక్కా మాస్ మసాలా చిత్రంగా ఈ చిత్రం రూపొందిందని టాక్ తేవటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ట్రేడ్ లో వినపడుతున్న లెక్కలు ప్రకారం... ఈ చిత్రం వరల్డ్ వైడ్ థియోటకల్ బిజినెస్ ఇప్పటికి 23.5 జరిగిందని సమాచారం. నైజాం ఏరియా 7.5, ఎపి రైట్స్ 12 కోట్లకు అమ్మారని సమాచారం. కర్ణాటక బిజినెస్ రెండు కోట్లు ఉండగా...ఓవర్ సీస్, మిగిలిన ఇండియా రైట్స్ కలిపి రెండు కోట్లు జరిగిందిని తెలుస్తోంది.
ఇక మరో ప్రక్క ఆడియో,శాటిలైట్ రైట్స్ కలిపి 7.5 వచ్చాయని వినికిడి. దాంతో మొత్తం ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 31 కోట్లు జరిగిందని అంటున్నారు. ఇది రవితేజ చిత్రాలలో పెద్ద రికార్డు.
ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, రావూ రమేష్, సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతమ్రాజు, మాటలు:కోన వెంకట్, నిర్మాత:రాక్లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి).