పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ చివరి సారిగా తన లండన్ షో కోసం డాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియోలను 'దిస్ ఈజ్ ఇట్' అనే ఓ డాక్యుమెంటరీగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండు గంటలు వ్యవధి గల ఈ డాక్యుమెంటరీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యి రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలయిన ఐదు రోజుల్లోనే 474 కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 281 కోట్ల రూపాయలకు ఈ డాక్యుమెంటరీని కోనుగోలు చేసిన సోనీ సంస్థ వచ్చిన లాభాలను ఆదివారం ప్రకటించింది.
కాగా ఈ డాక్యుమెంటరీ వసూళ్లలో సగం వాటా అమెరికాలోనే రావడంతో పాటు, ప్రేక్షకుల నుండీ వస్తున్న అద్భుతమైన స్పందనను చూసి తొలుత అమెరికాలో రెండు వారాలే ప్రదర్శించాలనుకొన్న ఈ సినిమాని ఇప్పుడు మూడు వారాల పాటు ప్రదర్శించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సోనీ సంస్థ ప్రకటించింది. దటీజ్ మైఖేల్...!!
కాగా ఈ డాక్యుమెంటరీ వసూళ్లలో సగం వాటా అమెరికాలోనే రావడంతో పాటు, ప్రేక్షకుల నుండీ వస్తున్న అద్భుతమైన స్పందనను చూసి తొలుత అమెరికాలో రెండు వారాలే ప్రదర్శించాలనుకొన్న ఈ సినిమాని ఇప్పుడు మూడు వారాల పాటు ప్రదర్శించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సోనీ సంస్థ ప్రకటించింది. దటీజ్ మైఖేల్...!!










Oneindia Login




