Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బ్యాంకాక్ లో ‘జగన్’
శాఖమూరి మల్లిఖార్జునరావు సూపర్ స్టార్ కృష్ణ బంధువు. ఈ చిత్రంలో ఆయన తనయుడు శివ హీరోగా నటిస్తున్నాడు. జగన్ రాజకీయ, వ్యక్తిగత జీవితానికి ఈచిత్రానికి ఎలాంటి సంబంధం లేదని, ఆ విషయాలపెై ఇందులో ఎలాంటి చర్చ ఉండదని కేవలం కథాపరంగా ఈ చిత్రానికి ఆ టైటిల్ కరెక్ట్గా సూట్ అవుతుందని పెట్టాం తప్ప వేరే ఉద్దేశం లేదని నిర్మాత శాఖమూరి మల్లిఖార్జునరావు తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ...ఇందులో హీరో పేరు 'జగన్', జైళుకు వెళ్ళినతను ఎలా 'నిర్ధోషి'గా బయటకు వచ్చాడన్నదే చిత్ర కథ అని తెలిపారు. కృష్ణగారి సూపర్హిట్ సినిమా 'ఖైది రుద్రయ్య' సినిమాలోని 'పువ్వెత్తి కొట్టమాకు పురుషోత్తమా' అనే పాటను రీమిక్స్ సాంగ్గా తీయడం జరుగుతోందని పేర్కొన్నారు. 5 పాటల చిత్రీకరణ, థాయ్లాండ్ మలేషియాలో 20రోజులపాటు చేశామని, ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసి, ఆడియోను, చిత్రాన్ని సెప్టెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
శృతిరెడ్డి, దీపాలిసింగ్, ప్రసాద్బాబు, ఎమ్మెస్ నారాయణ, నాగినీడు, సత్యంరాజేష్, అల్లరి సుభాషిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జయరామ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: వందేమాతరం, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: వెంకన్నబాబు యేపుగంటి.