Don't Miss!
- News TTD: తిరుమలలో ఆ సేవలు రద్దు, శ్రీరాముడి ఊరేగింపుకు ప్రత్యేక ఏర్పాట్లు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
చిరంజీవికి గిఫ్ట్ ఇవ్వాలనే సంకల్పమే సైరా.. సో రికార్డుల సునామీ గ్యారెంటీ: సురేందర్ రెడ్డి
చిరంజీవి హీరోగా తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా రాబోతున్న చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సంచలనాలకు నాంది పలికేలా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. అయితే ఈ మూవీ ట్రైలర్ లాంచ్లో భాగంగా మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి.
బాహుబలి సినిమా తర్వాత ప్యాన్ ఇండియా సినిమాలకు డిమాండ్ నెలకొంది. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి నుండి ఎలాంటి రికార్డులను ఆశించవచ్చు? అని ఓ మీడియా ప్రతినిథి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన సురేందర్ రెడ్డి.. సైరా చిత్రాన్ని రికార్డ్స్ కోసమో లేదంటే ఓ సినిమాను చూసో చేయలేదని, 'మా డాడీకి నేనొక పెద్ద గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన 150 సినిమాలు చేశారు. అందులో నెంబర్ వన్ మూవీ సైరా నరసింహారెడ్డి ఉండాలని, హిస్టరీలో ఆయన పేరు ఉండిపోవాలి అనే రామ్ చరణ్ కోరికతో ఈ సినిమా చేశామని అన్నారు. ఓ మంచి ఉద్దేశంతో చిరంజీవికి గిఫ్ట్ ఇవ్వాలనే సంకల్పంతో చేసిన సినిమా కాబట్టి సైరా రికార్డులు సృష్టించడం ఖాయమని భావిస్తున్నట్లు సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై మెగా పవర్స్టార్ రామ్చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.