Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Raj Kundra in Porn Rocket: పూనమ్ పాండేపై బాంబు పేల్చిన షెర్లిన్ చోప్రా..
బాలీవుడ్లో పోర్న్ రాకెట్ కేసు సంచలనం రేపుతున్నది. ఇప్పటికే పలు వివాదాలతో సతమతమవుతున్న హిందీ సినిమా పరిశ్రమను మరో వివాద భూతం వెంటాడుతున్నది. అశ్లీల సినిమాల నిర్మాణం, యాప్ల ద్వారా ప్రమోషన్ చేస్తున్నారనే ఆరోపణలపై శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ కావడం సినీ పరిశ్రమ వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే ఈ కేసులో తొలిసారి విచారణకు హాజరైన శృంగారతార షెర్లీన్ చోప్రా ఘాటుగా స్పందించింది. రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత మరో సెక్స్ బాండ్ పూనమ్ పాండే చేసిన కామెంట్లపై ఘాటుగా స్పందించింది.
పూనమ్ పాండే కామెంట్స్పై షెర్లీన్ చోప్రా
రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత పూనమ్ పాండే స్పందిస్తూ.. శిల్పాశెట్టి, ఆమె పిల్లలను చూస్తే బాధేస్తున్నది. రాజ్ కుంద్రా అరెస్ట్తో హృదయం ముక్కలైనంత పని అయింది అంటూ కామెంట్ చేసింది. పూనమ్ పాండే చేసిన కామెంట్లపై షెర్లీన్ చోప్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత వాళ్లు ఎవరికీ కనిపించకుండా అండర్గ్రౌండ్కు వెళ్లడం గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
నాకు సమన్లు వస్తే అంటూ షెర్లీన్
అయితే ఈ కేసులో తనను విచారించడంపై షెర్లీన్ వివరణ ఇస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. చాలా రోజులుగా రాజ్ కుంద్రా గురించి బయటకు వచ్చిన విషయాన్ని తెలుసుకోవడానికి మీడియా చాలా రకాలుగా ప్రయత్నించింది. ఆయన విషయాన్ని మహారాష్ట్ర సైబర్ సెల్ దర్యాప్తు బృందానికి వెళ్లడించాను. రాజ్కుంద్రాకు సంబంధం ఉన్న ఆర్మ్స్ప్రైమ్ సంస్థ గురించి అన్ని విషయాలు చెప్పాను అంటూ వివరించారు. నాకు సమన్లు వస్తే నేను కనిపించకుండా పోలేదు అంటూ షెర్లీన్ చెప్పారు.
దేశం విడిచిపోలేదు అంటూ
పోర్న్ రాకెట్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తే.. దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నించలేదు. ధైర్యంగా వెళ్లి విచారణకు హాజరయ్యాను. ప్రస్తుతం ఆ కేసు విచారణ జరుగుతున్నది. ఈ విషయంలో వాస్తవాలను అధికారులకు వెల్లడించాను అని షెర్లీన్ చోప్రా వెల్లడించారు. పరోక్షంగా పూనమ్, శిల్పాశెట్టిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
సైబర్ సెల్కు వెల్లడించా అంటూ
రాజ్ కుంద్రాకు సంబంధించిన కంపెనీలు, వ్యవహారాలపై ఇప్పటి వరకు నాకు తెలిసిన సమాచారాన్ని మహారాష్ట్ర సైబర్ సెల్కు చెప్పాను. మీడియాకు సంబంధించిన వ్యక్తులు, రిపోర్టుల నన్ను ఈ విషయంపై ఒత్తిడి చేయవద్దు. ఏదైనా కావాలంటే మహారాష్ట్ర సైబర్ సెల్ విభాగాన్ని అడిగి తెలుసుకొండి. దయచేసి నన్ను ఇందులోకి లాగవద్దు అంటూ షెర్లీన్ వేడుకొన్నారు.
రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత
రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకొన్నాయి. ఉన్నతస్థాయిలో ఈ కేసును ముంబై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ కుంద్రాతో పనిచేసే భాగస్వాముల బ్యాంక్ అకౌంట్లను ఇప్పటికే సీజ్ చేశారు. కోట్లాది రూపాయలను ముంబై పోలీసులు సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలువురిని ప్రశ్నిస్తూ ఈ దందాలో చీకటి కోణాలను వెలికి తీస్తున్నారు.