Don't Miss!
- News పులివెందులలో జగన్ మెజార్టీ ఎంత - షర్మిల మంత్రాంగం..!!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
Radhe Shyam వాళ్లకే కాదు.. నాకు కూడా డార్లింగ్.. ప్రభాస్ గురించి భాగ్యశ్రీ షాకింగ్ విషయాలు
మైనే ప్యార్ కియా సినిమాతో సంచలనం సృష్టించిన హీరోయిన్ భాగ్య శ్రీ కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్నారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్ సినిమా చేశారు. ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన రాధే శ్యామ్ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత రాధేశ్యామ్ మార్చి 11వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషనల్లో పాల్గొంటున్న భాగ్యశ్రీ ఈ సందర్భంగా మాట్లాడుతూ..
రాధేశ్యామ్ సెట్లోకి వెళ్లగానే..
చాలా సంవత్సరాల తర్వాత తెలుగు సినిమా చేయడం కొంచెం నెర్వస్గా అనిపించింది. రాధేశ్యామ్ సినిమా సెట్లోకి వెళ్లగానే.. మీకు మేమంత ఫ్యాన్స్ అని దర్శకుడు రాధాకృష్ణ చెప్పి నన్ను కూల్ చేశాడు. అందరి డార్లింగ్ ప్రభాస్ సెట్లోకి రాగానే నాకు డార్లింగ్గా మారిపోయాడు. ప్రభాస్ నాతో మాట్లాడుతూ.. మీతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. మీరంటే మాకు చాలా ఇష్టమని చెప్పడంతో నా నెర్వస్ మొత్తం పోయింది. ముంబైలో చాలా సినిమాలకు పనిచేశాను. కానీ సెట్లో ప్రతీ ఒక్కరు నన్ను కంఫర్ట్ ఉంచారు. రాధేశ్యామ్ నాకు మంచి అనుభూతిని ఇచ్చింది అని భాగ్య శ్రీ చెప్పారు.
ప్రభాస్ తల్లిగా.. డ్యాన్సర్గా
ప్రభాస్కు తల్లిగా నేను నటించాను. యంగ్ మదర్గా నేను డ్యాన్సర్ కనిపిస్తాను. ఆ పాత్ర కోసం నేను ఎక్సర్సైజులు, డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాను. ఈ సినిమాలో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. అది సినిమాలోనే చూస్తే అర్ధం అవుతుంది. తలైవి సినిమాలో కూడా తల్లి పాత్రలో కనిపించాను. ఈ రెండు పాత్రలు ఒకేసారి నాకు వచ్చాయి. కాకపోతే రిలీజ్ డేట్స్ మారాయి. కరోనావైరస్ కారణంగా రాధేశ్యామ్ ఆలస్యమైంది. ఎట్టకేలకు మార్చి 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవుతున్నది అని భాగ్య శ్రీ అన్నారు.
తక్కువ సమయంలోనే డ్యాన్స్ నేర్చుకొని
రాధేశ్యామ్ సినిమా కోసం అతి తక్కువ సమయంలో డ్యాన్స్ నేర్చుకోవడం నాకు ఛాలెంజింగ్గా అనిపించింది. ఆరు రోజులపాటు సాంగ్ షూట్ చేశారు. దేశంలో సాంప్రదాయ కథక్, భరతనాట్యం నేర్చుకోవాలంటే ఏళ్లు పడుతుంది. కానీ నేను వారం రోజుల్లోనే నేర్చుకొన్నాను. అయితే ఎక్కడా తప్పు చేశాననే ప్రేక్షకులు, డ్యాన్సర్లు గుర్తించుకుండా చాలా శ్రద్దగా నేర్చుకొన్నాను. అత్యంత చలి ప్రదేశమైన జార్జియాలో ఈ డ్యాన్స్ను షూట్ చేయడం మరో ఛాలెంజ్గా మారింది. అందరూ జాకెట్స్ వేసుకొని ఉంటే.. నేను కాళ్లకు ఏమీ లేకుండా డ్యాన్స్ చేశాను అని భాగ్య శ్రీ తెలిపారు.
ప్రభాస్ నాకు కూడా డార్లింగ్
రాధేశ్యామ్ యూనిట్ ఓ ఫ్యామిలీలా పనిచేసింది. మేమంత కలిసి భోజనం చేసేవాళ్లం. ప్రభాస్ ఇంటి నుంచి అందరికి మంచి భోజనం తీసుకు వచ్చేవారు. మేము కబుర్లు చెప్పుకొంటూ లంచ్ చేసేవాళ్లం. మా అల్లరి చూసి డైరెక్టర్ బ్రేక్ టైమ్ అయిపోయింది. షూటింగ్కు రండి అంటూ పిలిచేవారు అలా సినిమా షూట్ చాలా సరదాగా జరిగిపోయింది అని భాగ్య శ్రీ చెప్పారు. రాధే శ్యామ్ సినిమాను నిర్మించిన ప్రోడక్షన్ హౌస్ చాలా పెద్దది. ఈ సినిమా రోజు రోజుకు రేంజ్ పెరుగుతున్నది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ హై రేంజ్లో ఉంది. ఈ సినిమా హాలీవుడ్ స్థాయికి తగినట్టు ఉంటుంది అన్నారు.
అందరికి చాలా రెస్పెక్ట్ ఇస్తారు..
ప్రభాస్ గురించి బాహుబలి తర్వాతే తెలిసింది. ఆ సినిమాలో ప్రభాస్ చూసిన తర్వాత నాకు బాగా నచ్చాడు. ఒకసారి రాధే శ్యామ్ సినిమా సెట్లో కలిసిన తర్వాత అందరికి డార్లింగ్ అనిపించే ప్రభాస్ నాకు అలాంటి ఫీలింగ్ కల్పించాడు. దేశవ్యాప్తంగా భారీ క్రేజ్, స్టార్డమ్ ఉన్నప్పటికీ ప్రభాస్ చాలా ఒదిగి ఉంటాడు. మంచి క్రమశిక్షణతో మెదులుతాడు. ఎదుటివారికి మంచిగా గౌరవం ఇస్తాడు.
రిలేషన్స్కు రెస్పెక్ట్ ఇస్తాడు. ఫ్యామిలీ అంటే చాలా గౌరవం. సిస్టర్స్, బ్రదర్స్, ఇతర కుటుంబ సభ్యులంటే ప్రభాస్కు ప్రాణం. ఉమ్మడి కుటుంబం కనిపించని ఈ రోజుల్లో ప్రభాస్ తన కుటుంబం కోసం ప్రాణాలు ఇచ్చేస్తాడు అని భాగ్య శ్రీ అన్నారు.
Recommended Video
ఫ్యామిలీ బాండింగ్తో
ఇప్పుడు సినీ రంగంలో మంచి పాత్రలు పోషించేందుకు సిద్దమయ్యాను. దేశంలోనే అంతా తెలుగు సినిమా వైపు చూస్తున్నారు. హిందీలో చాలా తెలుగు సినిమాలు రీమేక్ అవుతున్నాయి. అలాంటి తెలుగు సినిమాతో బంధం పెంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్లతో నటించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు తెలుగు సినిమాలు అనే అభిప్రాయం లేదు. తెలుగు సినిమాలన్నీ ప్యాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అవుతున్నాయి. భాషాభేదం లేదు అంటూ భాగ్య శ్రీ చెప్పింది.