Don't Miss!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
Karthika Deepam మీటర్ పగిలిపోతుంది.. సొంత బావకే శౌర్య వార్నింగ్
ప్రేమ్ కారుకు శౌర్య ఆటో అడ్డుగా పెట్టడంతో షాపింగ్ మాల్ వద్ద గొడవ జరిగింది. మాటలతో సర్ది చెప్పుకొనే విషయానికి గొడవ పడటం ఏమిటి? అని ఇంద్రుడు, చంద్రమ్మ ప్రేమ్కు సర్దిచెప్పబోయారు. ఆటో అడ్డంగా పెట్టి అడ్డంగా వాదిస్తున్నది అని ప్రేమ్ అంటే.. నిలువుగా కూడా మాట్లాడుతాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే మీటర్ పగలిపోతుంది అని శౌర్య గట్టిగా సమాధానం ఇచ్చింది. అయితే ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు అంటూ ప్రేమ్ ఎదురుతిరిగాడు.
ఏంటీ? ఏంటీ అంటూ ఇద్దరు ఒకరిపై ఒకరు కలియబడబోతే.. ఇంద్రుడు, చంద్రుడు ఆపారు. కారుకు ఆటో అడ్డుపెట్టి గొడవ పెట్టడం పెద్ద తప్పు అని ప్రేమ్ అంటే.. పక్కన నుంచి వెళ్లవచ్చు కదా అని శౌర్య సమాధానం ఇచ్చింది. తక్కువ గ్యాప్లో కారు ఎవడైనా తీస్తాడా అని అంటే.. సరే సరే.. నా ఆటో తీస్తాను.. తర్వాత నీ కారు తీసుకో అంటూ చెప్పింది. శౌర్య ఆటో తీయడంతో గొడవ సద్దుమణిగింది. కార్తీక్ దీపం సీరియల్లో తాజా ఎపిసోడ్ 1308 రోజున ఇంకా ఏం జరిగిందంటే..
శౌర్య గురించి ఆలోచిస్తూ..
శౌర్య ఆచూకీ దొరకకపోవడంతో హిమ ఆలోచనల్లో పడింది. డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లో వేలు రాస్తూ ఆలోచిస్తుంటే.. ఏంటి హిమ.. డాక్టర్ అయి ఉండి.. ప్లేట్లో అన్నం తినకుండా ఆలోచిస్తున్నావు అని సౌందర్య అంటే.. చిక్ మంగళూరులో యాక్సిడెంట్లో కార్తీక్, దీప చనిపోయినప్పటి నుంచి హిమ మనసు అదోలా ఉంటున్నది. హిమ ఒక భావనలో ఉంటున్నది. తనను ఏమీ అనకు అని ఆనందరావు చెప్పారు. అంతలోనే కాకి అరిస్తే.. నానమ్మ కాకి అరిచింది అని హిమ అంటే.. కాకుల అరుస్తాయి. వాటి గురించి పట్టించుకోవద్దు అని సౌందర్య సూచించింది.
కాకులు అరిస్తే.. దీప, శౌర్య అంటూ హిమ
కానీ కాకులు అరవడం వెనుక తనకు తెలిసిన ఓ ఎమోషనల్ విషయాన్ని హిమ చెబుతూ.. అంటే.. చిన్నప్పుడు శౌర్య చెప్పింది. నాన్న ఇంటికి వెళ్తామని అమ్మా, శౌర్య చెప్పింది. రోజు కాకులు ఎప్పుడు అరుస్తాయని వాళ్లు ఎదురు చూసేవారట. కాకులను పిలిచి మెతుకులు పెట్టేవారట.
శౌర్య ఇప్పుడు ఎలా ఉందో నానమ్మ.. ఏం చేస్తుందో కదా అని హిమ అంటే.. శౌర్య కోసం చేయని ప్రయత్నం లేదు. ఇక దేవుడిపైనే భారం వేసి చూడటమే అని సౌందర్య అన్నారు. మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. కానీ శౌర్యనే తప్పించుకొని తిరుగుతున్నట్టు అనిపిస్తున్నది అని ఆనందరావు అన్నాడు. దాంతో హిమ ఆవేదన ప్లేట్లోనే చేతులు కడిగివేసి బాధతో వెళ్లిపోయింది.
ప్రేమ్తో శౌర్య మరోసారి గొడవ
ఇంద్రుడు, చంద్రమ్మను చిల్లర దొంగతనాలు మాన్పించడానికి జైలర్ ప్రయత్నం చేస్తూ.. ధనికుల ఇంటిలో వంట మనుషులుగా పనిచేయడానికి ఏర్పాట్లు చేశారు. దాంతో ఇంద్రుడు చంద్రుడిని తీసుకొని జైలర్ చెప్పిన అడ్రస్కు శౌర్య వెళ్లింది. ఇంట్లోకి వెళ్లి సత్యంగారు ఉన్నారా? అని శౌర్య అడిగితే.. నేనే అని సత్యం సమాధానం ఇచ్చారు. దాంతో జైలర్ పంపించారని చెప్పగానే.. లోనికి వెళ్లారు. ఇంటిని మొత్తం కలియచూస్తుండటంతో పిచ్చి పిచ్చి పనులు చేయకండి అంటూ శౌర్య వార్నింగ్ ఇచ్చింది. శౌర్యతో సత్య మాట్లాడుతూ.. నాకు వంట చేస్తే చాలూ అని అంటుండగా.. ప్రేమ్ ఇంట్లోకి అడుగుపెట్టాడు.
వీళ్లు రచ్చ రంబోలా బ్యాచ్ అంటూ
శౌర్యను చూసి ఏయ్ ఆటో నువ్వు ఇక్కడేంటి? అంటే.. వీళ్లను ఇంట్లోకి ఎవరు రానిచ్చారు అంటే.. ఇంతకు నువ్వెవరు? అంటూ శౌర్య ప్రశ్నించింది. దాంతో నేను సత్యం సార్ కొడుకును అంటూ ప్రేమ్ సమాధానం చెప్పారు. దాంతో వీళ్లు మీకు తెలుసా అంటే.. వీళ్లు రచ్చ రంబోలా బ్యాచ్. వీళ్లను ఎందుకు రానిచ్చారు అంటే.. జైలర్ మనోహర్ పంపించాడు అని శౌర్య చెప్పింది. దాంతో ఆటో, కారు గురించి జరిగిన గొడవ గురించి చెప్పాడు. కారు కొనడం తెలుసు గానీ. పార్కింగ్ చేయడం రాదు అని శౌర్య చెప్పింది.
వారిద్దరూ గొడవ పడుతుంటే.. నీవు ఆమె ఆటో మీద చేయివేశావు. దాంతో నీకు కోపం వచ్చింది అని సత్యం చెప్పాడు. దాంతో శౌర్య ఆనందపడిపోయింది. అయితే వీళ్లను వంటపనికి తీసుకోవద్దు అంటూ ప్రేమ్ చెప్పాడు. దాంతో అల్రెడీ తీసుకొన్నాను. జైలర్ మనోహర్ చెప్పడంతో నిర్ణయం తీసుకొన్నాను అని సత్యం అన్నాడు.
నీకు మీటర్ పగిలిపోతుంది.. అంటూ శౌర్య వార్నింగ్
అయితే ఇంటిలో వస్తువులను దొంగిలించాలని ఆలోచిస్తున్న ఇంద్రుడు, చంద్రుడిని చూసి.. కానీ ఒక్క కండిషన్.. వంట ఇంటి వద్దే చేసి తెస్తాం అని అంటే.. వంట బాగా చేయాలి అంటూ సత్యం చెప్పాడు. ఇక సాలరీ ప్రస్తావన వస్తే.. మీకు ఎంత ఇవ్వాలో నాకు తెలుసు అంటూ సత్యం వెళ్లిపోయాడు. అయితే నీకు జైలర్ అంకుల్ ఎలా తెలుసు అంటే.. నేను నాలుగు మర్డర్లు చేసి జైలుకు వెళ్లివచ్చాను అంటూ శౌర్య సెటైర్ వేసింది. ప్రేమ్కు తన వేలిని చూపిస్తూ.. నీ సంగతి చూస్తా. ఎక్స్ట్రా చేస్తే మీటర్ పగిలిపోతుంది అంటూ సొంత బావ అని తెలియని శౌర్య వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయింది.