Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Salman Khan తో వెంకటేష్ మల్టీస్టారర్.. షూటింగ్ ఎక్కడో తెలుసా?
F3 మూవీ రిలీజ్తో మంచి జోష్లో ఉన్న విక్టరీ వెంకటేశ్ మరో మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సారి తెలుగు సినిమా కాకుండా బాలీవుడ్ సినిమా కోసం సల్మాన్ ఖాన్తో నటించేందుకు సిద్ధమవుతున్నారు. సల్మాన్ ఖాన్తో కలిసి కభీ ఈద్ కభీ దీవాళీ చిత్రంలో నటించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అంతా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరుగనున్నది.
ఫర్హాద్ సమ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు సంబంధించిన షూటింగ్ కోసం కోకాపేటలో భారీ సెట్ వేశారు. ఈ సెట్లోనే రెండు షెడ్యూల్స్ షూటింగ్ చేస్తారు. కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేస్తారు. పూజా హెగ్గే నటిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్, ముంబైలో షూటింగ్ ముగించి డిసెంబర్ 30వ తేదీన రిలీజ్కు సిద్దమవుతున్నది.
హైదరాబాద్లో జరిగే షూటింగులో సల్మాన్ ఖాన్, ఆయన పక్కన నటించే సోదరుల క్యారెక్టలపై ప్రధాన సన్నివేశాలు చిత్రీకరిస్తారు. అలాగే పూజా హెగ్డే, సల్మాన్ ట్రాక్ షూటింగ్ జరుపుతారు. ఇదే సమయంలో వెంకటేష్, సల్మాన్ మధ్య సీన్స్ చిత్రీకరణ పూర్తి చేస్తారు అని సినీ వర్గాలు వెల్లడించారు. ఈ చిత్రం జగపతిబాబు కూడా కీలక పాత్రను పోషిస్తారు.
అయితే కభీ ఈద్ కభీ దీవాళీ చిత్రం తమిళంలో రూపొందిన వీరమ్, తెలుగులో కాటమరాయుడు సినిమా ఆధారంగా రూపొందుతున్నది. అయితే ఇటీవల వెంకటేశ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. వీరమ్ సినిమా ప్రధాన కథను తీసుకొన్నాం. మిగితాది ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా మార్చేశాం. వీరమ్, కాటమరాయుడు సినిమాలకు ఎక్కడ పోలిక ఉండదు అని వెంకటేష్ తెలిపారు.
ఇదిలా ఉండగా, వెంకటేశ్ నెట్ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. ఇందులో రానా దగ్గుబాటి కూడా నటించడం గమనార్హం. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నది.