Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
Veera Simha Reddy: బాలయ్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. తొడగొట్టే టైం అంటూ థమన్ ట్వీట్
టాలీవుడ్లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ.. వరుస సినిమాలతో సందడి చేస్తోన్న హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. ఏజ్ పెరుగుతోన్నా ఎంతో ఉత్సాహంగా ప్రాజెక్టులను పట్టాలెక్కించే ఆయన.. గత ఏడాది వచ్చిన 'అఖండ' మూవీతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. అప్పటి నుంచి మరింత జోష్తో బాలయ్య కొత్త సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నారు. ఇలా ఇప్పుడు ఆయన 'వీరసింహారెడ్డి' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Jaya Krishna: కృష్ణ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మహేశ్ ఫ్యామిలీ నుంచి హీరో.. ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో!
క్రేజీ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'వీరసింహారెడ్డి' మూవీ ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ జోనర్తో రూపొందుతోంది. దీన్ని పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో కొన్ని నిజమైన సంఘటనల సమాహారంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం అనంతపురం ఏరియాలో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. అది కూడా పూర్తైతే ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ క్రేజీ మూవీ నుంచి ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేసే విషయాన్ని థమన్ బయట పెట్టేశాడు.
'వీరసింహారెడ్డి' మూవీ నుంచి ఇప్పటికే టీజర్తో పాటు టైటిల్ మోషన్ పోస్టర్ వచ్చింది. వీటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియా ద్వారా హిట్ ఇచ్చాడు. తాజాగా అతడు తన ట్విట్టర్ ఖాతాలో 'జై బాలయ్య.. త్వరలోనే తొడగొట్టి దుమ్ములేపే టైం వచ్చిందిరోయ్' అని ట్వీట్ చేశాడు. దీంతో ఆ లిరిక్స్తో మొదటి పాటను వదలబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నందమూరి అభిమానులు దీనికోసం వేచి చూస్తున్నారు.
యాంకర్ వర్షిణి హాట్ సెల్ఫీ వైరల్: ఆ పార్ట్ను హైలైట్ చేస్తూ అరాచకం
నటసింహా బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' మూవీలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.