Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
NBK108: బాలయ్యకు జోడీగా విజయ్ దేవరకొండ హీరోయిన్.. ఇదేం ట్విస్టు సామీ!
కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలను చేస్తూ ముందుకు వెళ్తోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అలాంటిది విజయం వస్తే మాత్రం ఆయన మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత బాలయ్య.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో 'వీరసింహారెడ్డి' అనే సినిమాను చేస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదల కాబోతుంది.
షర్ట్ విప్పేసిన తెలుగు పిల్ల శ్వేతా నాయుడు.. హాట్ షోతో తెగించిన మెహబూబ్ గర్ల్ఫ్రెండ్
'వీరసింహారెడ్డి' షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే నటసింహా నందమూరి బాలకృష్ణ.. తన 108వ సినిమాను సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాను అతి త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ ఈ మూవీ కాస్టింగ్పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే పలు పాత్రలకు సంబంధించి కొందరు నటీనటులను ఆయన ఎంపిక చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
క్రేజీ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే మెయిల్ ఫీమేల్ లీడ్గా సోనాక్షి సిన్హా నటిస్తుందని అన్నారు. కానీ, ఆమె ఇందులో నటించడం లేదని స్వయంగా వెల్లడించారు. ఇక, ఈ పాత్ర కోసం ప్రియమణిని తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో రెండో హీరోయిన్గా 'ట్యాక్సీవాలా' ఫేం ప్రియాంక జావాల్కర్ను తీసుకున్నారట. ఆమె రోల్ ఇందులో ఎంతో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే, గ్లామర్ షోను కూడా చేయబోతుందని సమాచారం.
జబర్ధస్త్ రీతూ ఎద అందాల ప్రదర్శన: ఈ ఫోజుల్లో ఆమెను చూశారంటే!
ఇదిలా ఉండగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న ఈ సినిమాలో శ్రీలీలా ఆయన కూతురిగా నటిస్తుందని అంటున్నారు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్లో కావడంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డ విషయం తెలిసిందే.