Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Jr NTR: తప్పంతా ఎన్టీఆర్దే.. పిలిచినా రాలేదు.. టీడీ జనార్ధన్ కామెంట్స్
ఐదారేళ్లుగా సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. సినీ ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన తారక్ తన నటనాకౌశల్యంతో కోట్లలో అభిమానులను సంపాదించుకున్నాడు. మొదటి సినిమా నుంచి నేటి RRR వరకు నటనలో వైవిధ్యం చూపిస్తూ అలరిస్తున్నాడు. అయితే తాజాగా సర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు తారక్ రాకపోవడంపై పలు విమర్శలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు ఆహ్వానంపై టీడీ జనార్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
హాజరు కానీ తారక్: తెలుగు దేశం పార్టీ వ్వయస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా వారం రోజుల క్రితం హైదరాబాద్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరైన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలకు ఆయన మనువడు, నట వారసుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరు కాలేదు. దీంతో అటు రాజకీయపరంగా, ఇటు సినిమాల పరంగా జోరుగా చర్చ నడుస్తోంది. రెండు వేర్వేరు వాదనలు వినిపిస్తున్నాయి.
ఏది ముఖ్యం: నందమూరి, నారా కుటుంబాలు జూనియర్ ఎన్టీఆర్ ను అవమానిస్తున్నాయని, అతన్ని సినీ రంగంలో తొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని టాక్. అందుకే ఈ వేడుకలకు తారక్ రాకుండా మంచి పని చేశాడని ఓ వర్గం అంటోంది. పుట్టిన రోజు వేడుకలకు కుటుంబాలతో సహా విదేశాలకు వెళ్తే ఎలా వస్తాడని, విజయవాడలో జరిగిన వేడుకలకు కూడా తారక్ ను పిలవలేదని, ఇప్పుడు పిలిచినా అటెండ్ కాలేదని మరో వర్గం అంటోంది. అలాగే తాత శత జయంతి వేడుకలు ముఖ్యమా.. ట్రిప్ ముఖ్యమా అని కొంతమంది అంటున్నారు.
22 కుటుంబాలతో: ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పర్యవేక్షిస్తున్న టి.డి. జానర్థన్ ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. "ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఆహ్వానం ఇవ్వాలని ప్రయత్నించాం. ఆయనేమో వారం తర్వాత అపాయింట్ మెంట్ ఇచ్చారు. సరేనని వెళ్లి కలిసి విషయం చెప్పాం. అప్పుడాయన ముందుగానే మా పోగ్రామ్ ఫిక్స్ అయిందన్నారు. 22 ఫ్యామిలీలతో కలిసి ట్రిప్ కు వెళ్తున్నాం. ముందుగానే అనుకున్నాం" అని చెప్పారు అని జనార్ధన్ పేర్కొన్నారు.
కల్యాణ్ రామ్ కూడా:"ఎన్టీఆర్ చెప్పిన దానికి మేం బాబు.. పుట్టినరోజులు మళ్లీ వస్తుంటాయి. శత జయంతి అనేది ఒకసారే మాత్రమే వస్తుందని కూడా అన్నాం. కానీ ఆయనకు షెడ్యూల్ కుదర్లేదేమో. మేం చెప్పాల్సింది చెప్పాం. ఆయన నిర్ణయం తీసుకున్నారు. కల్యాణ్ రామ్ ను కూడా ఈ శత జయంతి వేడుకలకు ఆహ్వానించాం. ఆయన కూడా తారక్ తో పాటే వెళ్లినట్లున్నారు. అందుకే రాలేకపోయినట్లు భావిస్తున్నాం" అని జనార్ధన్ చెప్పుకొచ్చారు.
టార్గెట్ చేస్తూ: ఇక జనార్ధన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ దే తప్పు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తారక్ ప్రస్తుతం దేవర, వార్ 2, ప్రశాంత్ నీల్ NTR31 సినిమాలతో బిజీగా ఉన్నాడు.