Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Devara: సముద్రం అడుగున ఎన్టీఆర్ రిస్క్.. సినిమాలో హైలైట్ సీక్వెన్స్ ఇదేనట
వరుస పెట్టి హిట్లు మీద హిట్లు.. హిట్లు మీద హిట్లు కొడుతూ కొంత కాలంగా భీకరమైన ఫామ్తో దూసుకుపోతోన్నాడు జూనియర్ ఎన్టీఆర్. మరే హీరోకూ సాధ్యం కాని రీతిలో వరుసగా ఆరు విజయాలను అందుకున్న అతడు.. RRR అనే చిత్రంతో ఇంటర్నేషనల్ క్రేజ్ను సొంతం చేసుకున్నాడు. ఫలితంగా మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఎన్టీఆర్.. తన 30వ చిత్రం 'దేవర'ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్న విషయం తెలిసిందే. హిట్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై హైప్ భారీగా పెరుగుతూనే ఉంది.
Anasuya Bharadwaj: అనసూయ ఓవర్ డోస్ హాట్ షో.. బెత్తెడంత బికినీలో బాబోయ్ మరోసారి!
కోస్టల్ బ్యాగ్డ్రాప్తో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ను గత మార్చిలోనే ప్రారంభించారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన మూడు భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. చివరిగా జరిగిన దానిలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూడా భాగం అయ్యారు. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్లతో పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్తో పాటు మేజర్ హైలైట్ పాయింట్పై ఓ క్రేజీ న్యూస్ లీకైంది.
సక్సెస్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న 'దేవర' మూవీలో సముద్రంపై వచ్చే కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా ప్లాన్ చేశారట. అందులో ఒకటి సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ మధ్య నీటి అడుగు భాగంలో జరుగుతుందని తెలిసింది. ఇందులో ఎన్టీఆర్ డూప్ లేకుండానే రిస్క్ చేయబోతున్నాడని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన షూటింగ్ను మరికొద్ది రోజుల్లోనే జరగనున్న షెడ్యూల్లో షూట్ చేస్తారని అంటున్నారు. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ వాటర్ సెట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.
యాంకర్ విష్ణుప్రియ క్లీవేజ్ షో: ఊరించే ఫోజులతో టెంప్ట్ చేసేలా!
ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో రాబోతున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తారని ఎప్పుడో అనౌన్స్ చేశారు.